BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

ధ్వంసమైన వాహనంతో వినూత్న అవగాహన.. రోడ్డు భద్రతపై చైతన్యం కల్పించిన పెదవేగి పోలీసులు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jul, 2026 - 07:45 PM
28 వీక్షణలు

దెందులూరు నియోజకవర్గ రిపోర్టర్ పులువర్తి సంతోష్ కుమార్ 

ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణ, రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు పెదవేగి పోలీసులు వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు.

తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్న చింతలపూడి–ఏలూరు స్టేట్ హైవే-43 పరిధిలోని పెదవేగి మండలం విజయరాయి గ్రామం వద్ద ప్రత్యేక అవగాహన ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పూర్తిగా ధ్వంసమైన వాహనాన్ని ప్రదర్శనకు ఉంచి, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల కలిగే దారుణ పరిణామాలను ప్రజలకు ప్రత్యక్షంగా చూపించారు.

"హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరం.. మీ కుటుంబం కోసం హెల్మెట్ ధరించండి" అనే సందేశంతో భారీ అవగాహన బ్యానర్‌ను ఏర్పాటు చేసి, ద్విచక్ర వాహనదారుల్లో బాధ్యతాయుతమైన డ్రైవింగ్‌పై చైతన్యం కల్పించారు.

అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్ ధరించకపోవడం వంటి కారణాల వల్ల విలువైన ప్రాణాలు కోల్పోతున్నాయని పోలీసులు వివరించారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు నాణ్యమైన హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీటు బెల్ట్ వినియోగించాలని సూచించారు.

"సురక్షిత ప్రయాణమే కుటుంబానికి నిజమైన బహుమతి" అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు, వాహనదారులు ప్రశంసలు వ్యక్తం చేశారు. రోడ్డు భద్రతపై మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తామని వారు తెలిపారు.