www.ntodaynews.com
విద్యార్థులకు స్టేషనరీ వస్తువులు పంపిణీ చేసిన పూర్వ విద్యార్థులు
తెలంగాణ
విద్యార్థులకు స్టేషనరీ వస్తువులు పంపిణీ చేసిన పూర్వ విద్యార్థులు
NTODAY NEWS: రిపోర్టర్ కూనురు మధు
నల్గొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఒకటి నుండి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు అదే పాఠశాలలో 2006 - 2007 సంవత్సరంలో ఎస్.ఎస్.సి పూర్తి అయిన పూర్వ విద్యార్థులు కలిసి పెన్నులు జామెంట్రీ బాక్సులు పండ్లు పంపిణీ చేశారు. ఇక ముందు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద విద్యార్థులకు విద్య గురించి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా మా దృష్టికి తీసుకువస్తే మా వంతు సహకారం అందిస్తామని ఉపాధ్యాయులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని పిల్లలను బంగారు భవిష్యత్తుకు ఎదిగేలా తీర్చిదిద్దడంలో మేము పూర్తి సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అంబటి సత్తయ్య ఉపాధ్యాయులు బాదం బిక్షపతి సుధాకర్ రెడ్డి సరిత శారద చైతన్య వెంకటేశ్వర్లు ఎస్ ఎస్ సి 2006 - 2007 పూర్వ విద్యార్థులు చిన్నపాక నాగరాజు, పాల రాకేష్, దమ్మాల నరేందర్ రెడ్డి, వంగాల మహేష్, జిట్ట శేఖర్, దేవేందర్, శంకర్ రాజు, మహేష్, అనిల్, తాజుద్దీన్, జ్యోతి, అశ్విని, నీలమ్మ, తదితరులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube