www.ntodaynews.com
మీడియా ప్రతినిధులకు హెల్మెట్ల పంపిణీ
తెలంగాణ
పుంగనూరులో మీడియా ప్రతినిధులకు హెల్మెట్ల పంపిణీ
రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన ఎంబీఐ సుప్రియ
NTODAY NEWS: అన్నమయ్య జిల్లా పుంగనూరు రిపోర్టర్: రాఘవేంద్ర రాజు
పుంగనూరులో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పుంగనూరు రాజశ్రీ హీరో షోరూం సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుప్రియ పాల్గొని మీడియా ప్రతినిధులకు హెల్మెట్లు అందజేశారు.
ఇటీవల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో, విలేకరులు ప్రమాదాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సుప్రియ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తికి ఏదైనా జరిగితే అది మొత్తం కుటుంబంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. అందుకే ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ వాడాలని సూచించారు.
కార్యక్రమంలో పాల్గొన్న పుంగనూరు మీడియా ప్రతినిధులు
“హెల్మెట్ ధరించుదాం – ప్రాణాలను కాపాడుకుందాం”
అనే నినాదంతో వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.
#RoadSafety
#HelmetAwareness
#Punganur
#MediaSafety
#TrafficRules
#SaveLives
#HelmetIsMust
Follow us on
Website
Facebook
Instagram
YouTube