మర్యాలలో నామినేషన్ స్వీకరణ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు
NTODAY NEWS: బొమ్మలరామారం మండలం
యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలం, మర్యాల గ్రామపంచాయతీ లో నిర్వహిస్తున్న నామినేషన్ స్వీకరణ ప్రకియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హనుమంత రావు.శనివారం రోజున మర్యాల గ్రామ పంచాయతీలో నిర్వహిస్తున్న నామినేషన్ లో భాగంగా ఇప్పటి వరకు ఎన్ని వచ్చాయని,ఈరోజు మొదటి విడత నామినేషన్ లాస్ట్ రోజు ఉందని కాబట్టి సాయంత్ర 5 గంటల వరకు నామినేషన్ వేయడానికి వచ్చిన వారందని నామినేషన్ వేయించాలన్నారు. హెల్ప్ డెస్క్ ను పరిశీలించారు, హెల్ప్ డెస్క్ తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని అవసరమైన వారికి సహాయ సహకారాలు అందించాలని సూచించారు. అభ్యర్థులకు ఏమైనా సమస్యలు వస్తే వెంటనే వారికి వివరిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ ఫారం కూడా క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. గ్రాపంచాయతీ ముందు బారికేడ్లు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమం లో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube