www.ntodaynews.com
ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
తెలంగాణ
రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు
యాదాద్రి భువనగిరి జిల్లా,రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు, రెండు గంటల పాటు అన్ని సమస్యల్ని క్షుణ్ణంగా తెలుసుకున్న జిల్లా కలెక్టర్ రోగులతో, ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఆసుపత్రి నిర్వహణపై కలెక్టర్ తీవ్ర అసహనం కలెక్టరు ఉండగానే పాము కరచి వచ్చిన వృద్దురాలు, వైద్య సదుపాయం లేదని నల్లగొండకు పంపిన వైద్యులు మార్గ మధ్యలోనే మరణించిన మహిళ. ఆసుపత్రి సమస్యపై కలెక్టర్ కు CPM నాయకుల వినతి డ్యూటీలో ఉన్నట్టు చూపిస్తూ ఐదుగురు డాక్టర్లు గైర్హాజరైన తీరుపై సీరియస్ అయిన కలెక్టర్. తాగడానికి మంచినీళ్లు లేక బయట నుండి నీళ్లు తెచ్చుకుంటుంటే ఏం చేస్తున్నారు. విధులు సక్రమంగా నిర్వహించని డాక్టర్లకు షోకాజు నోటీసులు ఇచ్చి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. డెంటల్ డాక్టర్ రాకున్నా రెగ్యులరగా వచ్చి వైద్యం చేస్తున్నట్లు రికార్డులో ఉండటం ఏంటని ప్రశ్నించారు. గతం కంటే కాన్పుల సంఖ్య ఎందుకు తగ్గిందని, దానికి గల కారణాలు ఏమిటని ఆరాతీశారు 15 మంది స్టాఫ్ నర్స్ లకు ఒకే కామన్ టాయిలెట్ ఉందని తెలిపిన స్టాఫ్ నర్సులు. సానిటేషన్ నిర్వహణ సరిగా లేకపోవడంతో ఏజన్సీ కాంట్రాక్టర్ కు ఫోన్ చేసి సీరియస్ అయిన కలెక్టర్. పేదలకు వైద్యం అందించే ఆసుపత్రీపై నిర్లక్ష్యంగా వ్యవహారిస్తే కఠిన చర్యలుంటాయాన్ని హెచ్చరిక. రోగులపట్ల ప్రేమాగా ఉండాలని, బయటికి మందులు రాయవద్దని, దురుసుగా మాట్లాడవద్దని స్టాఫ్ నర్సులకు సూచించారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube