BREAKING
నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం..
Date of Publish : 24 February 2026, 08:03 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ఉద్యోగాల పేరుతో మోసాలకు గురికావద్దు

తెలంగాణ
24 Feb, 2026 - 08:03 AM
293 వీక్షణలు
ఉద్యోగాల పేరుతో మోసాలకు గురికావద్దు: కర్నూలు ఎస్పీ హెచ్చరిక NTODAY NEWS: కర్నూలు జిల్లా కర్నూలు ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు మధ్యవర్తుల ద్వారా రావని, కేవలం పోటీ పరీక్షలు మరియు ప్రతిభ ఆధారంగానే లభిస్తాయని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఉద్యోగాల పేరుతో మోసపోయిన నిరుద్యోగుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొన్నారు. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్, కోర్టులు, స్టాఫ్ నర్స్, ఫీల్డ్ అసిస్టెంట్, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు, బ్యాంకులు, హోంగార్డ్స్, ఫుడ్ కార్పొరేషన్, విద్యుత్, వ్యవసాయ, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు, జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్, క్లర్క్ వంటి పలు ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకోవడం పూర్తిగా మోసపూరితమని స్పష్టం చేశారు. ప్రైవేట్ రంగంలో కూడా అర్హతలు, నైపుణ్యాలు మరియు ఎంపిక విధానాల ప్రకారమే నియామకాలు జరుగుతాయని పేర్కొన్నారు. ఎస్పీ సూచనలు: ఉద్యోగాల పేరుతో ఎవరికి కూడా డబ్బులు చెల్లించవద్దు. అధికారిక నోటిఫికేషన్లు మాత్రమే నమ్మాలి. అనుమానాస్పద కాల్స్, మెసేజ్‌లు వచ్చిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. నిరుద్యోగ యువత తమ ప్రతిభపై నమ్మకం ఉంచుకుని పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి. ఉద్యోగాల పేరుతో మోసగాళ్ల వలలో పడకుండా అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. మోసాలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. #Kurnool #JobFraudAlert #AndhraPradeshPolice #YouthAwareness #APPolice Follow us on Website Facebook Instagram YouTube