BREAKING
త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు
www.ntodaynews.com

ఉద్యోగాల పేరుతో మోసాలకు గురికావద్దు

తెలంగాణ
24 Feb, 2026 - 08:03 AM
182 వీక్షణలు
ఉద్యోగాల పేరుతో మోసాలకు గురికావద్దు: కర్నూలు ఎస్పీ హెచ్చరిక NTODAY NEWS: కర్నూలు జిల్లా కర్నూలు ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు మధ్యవర్తుల ద్వారా రావని, కేవలం పోటీ పరీక్షలు మరియు ప్రతిభ ఆధారంగానే లభిస్తాయని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఉద్యోగాల పేరుతో మోసపోయిన నిరుద్యోగుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొన్నారు. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్, కోర్టులు, స్టాఫ్ నర్స్, ఫీల్డ్ అసిస్టెంట్, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు, బ్యాంకులు, హోంగార్డ్స్, ఫుడ్ కార్పొరేషన్, విద్యుత్, వ్యవసాయ, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు, జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్, క్లర్క్ వంటి పలు ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకోవడం పూర్తిగా మోసపూరితమని స్పష్టం చేశారు. ప్రైవేట్ రంగంలో కూడా అర్హతలు, నైపుణ్యాలు మరియు ఎంపిక విధానాల ప్రకారమే నియామకాలు జరుగుతాయని పేర్కొన్నారు. ఎస్పీ సూచనలు: ఉద్యోగాల పేరుతో ఎవరికి కూడా డబ్బులు చెల్లించవద్దు. అధికారిక నోటిఫికేషన్లు మాత్రమే నమ్మాలి. అనుమానాస్పద కాల్స్, మెసేజ్‌లు వచ్చిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. నిరుద్యోగ యువత తమ ప్రతిభపై నమ్మకం ఉంచుకుని పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి. ఉద్యోగాల పేరుతో మోసగాళ్ల వలలో పడకుండా అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. మోసాలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. #Kurnool #JobFraudAlert #AndhraPradeshPolice #YouthAwareness #APPolice Follow us on Website Facebook Instagram YouTube