BREAKING
ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లకు ఆన్‌లైన్ దరఖాస్తుల ఆహ్వానం బేడా బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చాలి చనుబండలో ఇంటింటికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ​మంచిర్యాల నూతన ఏసీగా రాజు బాధ్యతల స్వీకరణ సూరంపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో భాగంగా పెన్షన్‌ల పంపిణీ డయేరియా నివారణకు జిల్లాలో అవగాహన కార్యక్రమాలు మోసపూరిత మద్దతు ధరలపై రైతు సంఘం ఆందోళన పాడి రైతుల అభివృద్ధే లక్ష్యం కీసర పోలీస్ స్టేషన్‌కు సీపీ సుమతి ​మంచిర్యాల డీఈఓ యాదయ్య బదిలీ ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లకు ఆన్‌లైన్ దరఖాస్తుల ఆహ్వానం బేడా బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చాలి చనుబండలో ఇంటింటికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ​మంచిర్యాల నూతన ఏసీగా రాజు బాధ్యతల స్వీకరణ సూరంపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో భాగంగా పెన్షన్‌ల పంపిణీ డయేరియా నివారణకు జిల్లాలో అవగాహన కార్యక్రమాలు మోసపూరిత మద్దతు ధరలపై రైతు సంఘం ఆందోళన పాడి రైతుల అభివృద్ధే లక్ష్యం కీసర పోలీస్ స్టేషన్‌కు సీపీ సుమతి ​మంచిర్యాల డీఈఓ యాదయ్య బదిలీ
www.ntodaynews.com

ఉద్యోగాల పేరుతో మోసాలకు గురికావద్దు

తెలంగాణ
24 Feb, 2026 - 08:03 AM
204 వీక్షణలు
ఉద్యోగాల పేరుతో మోసాలకు గురికావద్దు: కర్నూలు ఎస్పీ హెచ్చరిక NTODAY NEWS: కర్నూలు జిల్లా కర్నూలు ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు మధ్యవర్తుల ద్వారా రావని, కేవలం పోటీ పరీక్షలు మరియు ప్రతిభ ఆధారంగానే లభిస్తాయని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఉద్యోగాల పేరుతో మోసపోయిన నిరుద్యోగుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొన్నారు. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్, కోర్టులు, స్టాఫ్ నర్స్, ఫీల్డ్ అసిస్టెంట్, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు, బ్యాంకులు, హోంగార్డ్స్, ఫుడ్ కార్పొరేషన్, విద్యుత్, వ్యవసాయ, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు, జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్, క్లర్క్ వంటి పలు ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకోవడం పూర్తిగా మోసపూరితమని స్పష్టం చేశారు. ప్రైవేట్ రంగంలో కూడా అర్హతలు, నైపుణ్యాలు మరియు ఎంపిక విధానాల ప్రకారమే నియామకాలు జరుగుతాయని పేర్కొన్నారు. ఎస్పీ సూచనలు: ఉద్యోగాల పేరుతో ఎవరికి కూడా డబ్బులు చెల్లించవద్దు. అధికారిక నోటిఫికేషన్లు మాత్రమే నమ్మాలి. అనుమానాస్పద కాల్స్, మెసేజ్‌లు వచ్చిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. నిరుద్యోగ యువత తమ ప్రతిభపై నమ్మకం ఉంచుకుని పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి. ఉద్యోగాల పేరుతో మోసగాళ్ల వలలో పడకుండా అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. మోసాలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. #Kurnool #JobFraudAlert #AndhraPradeshPolice #YouthAwareness #APPolice Follow us on Website Facebook Instagram YouTube