www.ntodaynews.com
ఏలూరు జిల్లా సర్వ సభ్య సమావేశం
తెలంగాణ
ఏలూరు జిల్లా సర్వ సభ్య సమావేశం,
NTODAY NEWS: ఏలూరు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కళ్యాణ్ కుమార్,
బుధవారం ఏలూరు కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో జిల్లా ఇంచార్జ్ మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగిన జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమం లో గృహ నిర్మాణ శాఖ మంత్రి వర్యులు కోలుసు పార్థసారథి గారితో కలిసి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ పాల్గొన్నారు.
ఈ సమీక్షలో ధాన్యం కొనుగోలు, గృహనిర్మాణ కార్యక్రమాల పురోగతి, 22A అమలు, హౌస్ సైట్స్ పంపిణీ, అలాగే ఇటీవలి భారీ వర్షాలు మరియు తుఫాన్ వల్ల తీవ్రంగా దెబ్బతిన్న రహదారుల పరిస్థితి వంటి ప్రధాన అంశాలపై విస్తృతంగా చర్చ జరిపారు.
ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్ య , ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ,చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ,జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, జాయింట్ కలెక్టర్ అశోక్ గౌడ జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube