BREAKING
బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన చిర్ల జగ్గిరెడ్డి చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన చిర్ల జగ్గిరెడ్డి చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU
www.ntodaynews.com

ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రశాంత్ కిషోర్.....

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Aug, 2026 - 07:19 PM
29 వీక్షణలు

ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రశాంత్ కిషోర్.. బీజేపీ కంచుకోటలో చారిత్రాత్మక విజయం

పాట్నా: జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ (పీకే) ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం బీహార్ శాసనసభలో స్పీకర్ ప్రేమ్ కుమార్ సమక్షంలో బంకీపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణం చేశారు.

ఇటీవల ఆగస్టు 3న జరిగిన బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం సాధించారు. 1995 నుంచి బీజేపీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గాన్ని జన్ సూరజ్ పార్టీ తన ఖాతాలో వేసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఉప ఎన్నికలో ప్రశాంత్ కిషోర్‌కు 64,151 ఓట్లు లభించగా, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్‌పై 19,324 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఎన్నికల వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన పీకే.. తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం విశేషంగా మారింది.