శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ఎన్.టి.ఆర్ జిల్లా కలెక్టర్
ఎన్.టి.ఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మి శ గారు ఇంద్రకీలాద్రి పై కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు.దర్శనం అనంతరం ఆలయ ఈవో వికె శీనా నాయక్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదములు అందజేశారు.
అనంతరం దేవస్థానం లో గల ప్రధమ చికిత్స కేంద్రంను జిల్లా కలెక్టర్ పరిశీలన చేశారు. వేసవి ఎండ నేపథ్యంలో భక్తులకు అందిస్తున్న వైద్యసదుపాయాలు గురించి వివరాలు తెలుసుకున్నారు. రోగుల వివరాల రిజిస్టర్ పరిశీలించారు. భక్తుల నిమిత్తం దేవస్థానం శివాలయం వైపు, ఘాట్ రోడ్ వైపు వేసవి తీవ్రత రీత్యా అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందించేలా అవసరమైన ఏర్పాటు చేయాలని ఈవో శీనా నాయక్ ను ఆదేశించారు.
రాజగోపురం వద్ద ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ (గాంధీ ), ధర్మకర్తల మండలి సభ్యులతో కలెక్టర్ ముచ్చటించారు.అనంతరం మహామండపం వైపు నుండి ఆలయ ధర్మకర్తలు, అధికారులతో కలసి జిల్లా కలెక్టర్ పరిశీలన చేశారు.