BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

ఎన్నికల్లో రూ.100 కోట్ల వరకు ఖర్చు.. అవినీతి పెరుగుతోంది: గుత్తా

తెలంగాణ
/ నల్గొండ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 06:46 PM
68 వీక్షణలు

నల్గొండ: తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అవినీతి, ఎన్నికల ఖర్చులు, రాజకీయ వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు ఖర్చు చేస్తున్న పరిస్థితి నెలకొందని అన్నారు. అధికారుల్లో అవినీతి ఆందోళనకర స్థాయిలో పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు తిరిగి పోస్టింగులు ఇవ్వకూడదని సూచించారు. ఏసీబీ కేసుల్లో పట్టుబడిన వారికి కఠిన శిక్షలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో కార్యకర్తలే ప్రజాప్రతినిధులయ్యేవారని, ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కాంట్రాక్టర్లే రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నారని వ్యాఖ్యానించారు. చిన్న స్థాయి ఉద్యోగుల వద్ద కూడా కోట్ల రూపాయలు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. సేద్యయోగ్యమైన భూములకు మాత్రమే రైతు భరోసా అందించాలని అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలను నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా చిట్‌చాట్‌లో వెల్లడించారు.