మురికి కాలువల గురించి పట్టించుకోని అధికారులు
ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చిన వీధి లో మురికి కాలువల గురించి పట్టించుకోని అధికారులు
పుంగనూరు పట్టణం భగత్ సింగ్ కాలనీ లో నివసిస్తున్న మహిళల ఆవేదన
- మున్సిపల్ అధికారులు రాజకీయ నాయకులు
- 35 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నామని మా బాధ ఎవరికి చెప్పుకోవాలి
పుంగనూరు పట్టణం భగత్ సింగ్ కాలనీ లో ప్రభుత్వ పాఠశాల అంగన్వాడి సెంటర్ కు మధ్యలో గల వీధిలో మురికి కాలువ లేక గత 35 సంవత్సరాలుగా బాధపడుతున్నామని మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్న ఎవరు పట్టించుకోవడంలేదని ఆ వీధిలో గల మహిళలు మీడియాకు తెలిపారు వారు సందర్భంగా మాట్లాడుతూ మా బాత్రూంలు, లెట్రిన్ల లో నుంచి మురికి నీరు వెళ్లేందుకు కాలువలు లేక పోవడంతో ఇంటి ముందే గుంతలు కొవ్వుకొని అందులో స్టోర్ అయిన మురికి నీరును దుర్వాసన వస్తున్న భదిస్తూ ఆ నీరును బకెట్ల ద్వారా పెద్ద కాలువ ఉన్న చోటుకు తీసుకువెళ్లి పోస్తున్నామని వారు బాధ వ్యక్తం చేస్తున్నారు సంవత్సరాలు గడిచిన ఏ పార్టీ అధికారంలో ఉన్న ఇంతవరకు మా బాధను మున్సిపల్ అధికారులు గానీ
రహదారులు మరియు భవనచన వనములశాఖ మదనపల్లె డివిజన్
భగత్ సింగ్ కాలనీ BHAGATH SINGH COLONY
రాజకీయ నాయకులు కానీ ఎవరు పట్టించుకోలేదని, ఎన్నికలు వస్తే ప్రతి ఒక్కరూ వచ్చి మీకు అవి చేస్తాం ఇవి చేస్తాం కాలువలు వేయిస్తాం అని చెబుతున్నారే తప్ప ఇంతవరకు మా వీధి సమస్యల గురించి పట్టించుకున్న పావన పోలేదని ఎన్నిసార్లు మున్సిపల్ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినప్పుడు మాత్రం వస్తాం చూస్తామని చెబుతున్నారని, కాలువలు నమస్య పరిష్కారాన్ని
తీర్చలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇల్లు టాక్స్ కడుతున్నాం నీళ్లు టాక్స్ కడుతున్నామని, మాకు న్యాయం చేయనప్పుడు, మా సమస్యలు తీర్చినప్పుడు, టాక్సులు ఎందుకు కట్టాలలి. రాజకీయ నాయకులకు ఓట్లు ఎందుకు వేయాలి. అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.