BREAKING
ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్.
www.ntodaynews.com

ఎన్టీఆర్ జిల్లా, కంచికచర్లలో దొంగతనాలు పెరుగుదల – పోలీసులపై ప్రజల ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Jun, 2026 - 12:28 PM
18 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా, నందిగామ రెవెన్యూ డివిజన్ పరిధిలోని కంచికచర్ల మండలంలో దొంగతనాల ఘటనలు వరుసగా చోటుచేసుకుంటుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. నక్కలంపేట గ్రామంలో దొంగతనం జరిగి పది రోజులు గడిచినా ఇప్పటికీ నిందితులను పట్టుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

దొంగతనాల భయంతో గ్రామ ప్రజలు ఇంట్లోని విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకుంటున్న పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతం పెళ్లిళ్లు, ఫంక్షన్ల సీజన్ కావడంతో బంగారు ఆభరణాలను ఇంట్లో ఉంచాల్సిన పరిస్థితి ఎదురవుతోందని ప్రజలు చెబుతున్నారు.

గతంలో కంచికచర్ల సర్కిల్ కార్యాలయం, పోలీస్ స్టేషన్‌కు సమీపంలో ఉన్న వాసవి జ్యూయెలర్స్‌లో 350 గ్రాముల బంగారం, 15 కిలోల వెండి దొంగతనం జరిగిన ఘటన ఇంకా వెలుగులోకి రాకపోవడంతో వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2024లో జరిగిన ఈ కేసు కూడా ఇంకా చేదించలేదని సమాచారం.

అలాగే వసంతకాలనీలో ఒక మహిళపై బైక్‌పై వచ్చిన దొంగలు మెడలోని బంగారు గొలుసు లాక్కొని పారిపోయిన ఘటన కూడా చోటుచేసుకుంది. పరిటాల అంజినేయ స్వామి దేవస్థానంలో జరిగిన దొంగతనం కేసు కూడా ఇప్పటికీ పరిష్కారం కాలేదని బాధితులు పేర్కొంటున్నారు.

దొంగతనాల నియంత్రణలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, నిందితులను త్వరగా పట్టుకుని భద్రత కల్పించాలని ప్రజలు, బాధితులు డిమాండ్ చేస్తున్నారు.