BREAKING
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం
www.ntodaynews.com

ఎన్టీఆర్ జిల్లా, కంచికచర్లలో దొంగతనాలు పెరుగుదల – పోలీసులపై ప్రజల ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Jun, 2026 - 12:28 PM
88 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా, నందిగామ రెవెన్యూ డివిజన్ పరిధిలోని కంచికచర్ల మండలంలో దొంగతనాల ఘటనలు వరుసగా చోటుచేసుకుంటుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. నక్కలంపేట గ్రామంలో దొంగతనం జరిగి పది రోజులు గడిచినా ఇప్పటికీ నిందితులను పట్టుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

దొంగతనాల భయంతో గ్రామ ప్రజలు ఇంట్లోని విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకుంటున్న పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతం పెళ్లిళ్లు, ఫంక్షన్ల సీజన్ కావడంతో బంగారు ఆభరణాలను ఇంట్లో ఉంచాల్సిన పరిస్థితి ఎదురవుతోందని ప్రజలు చెబుతున్నారు.

గతంలో కంచికచర్ల సర్కిల్ కార్యాలయం, పోలీస్ స్టేషన్‌కు సమీపంలో ఉన్న వాసవి జ్యూయెలర్స్‌లో 350 గ్రాముల బంగారం, 15 కిలోల వెండి దొంగతనం జరిగిన ఘటన ఇంకా వెలుగులోకి రాకపోవడంతో వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2024లో జరిగిన ఈ కేసు కూడా ఇంకా చేదించలేదని సమాచారం.

అలాగే వసంతకాలనీలో ఒక మహిళపై బైక్‌పై వచ్చిన దొంగలు మెడలోని బంగారు గొలుసు లాక్కొని పారిపోయిన ఘటన కూడా చోటుచేసుకుంది. పరిటాల అంజినేయ స్వామి దేవస్థానంలో జరిగిన దొంగతనం కేసు కూడా ఇప్పటికీ పరిష్కారం కాలేదని బాధితులు పేర్కొంటున్నారు.

దొంగతనాల నియంత్రణలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, నిందితులను త్వరగా పట్టుకుని భద్రత కల్పించాలని ప్రజలు, బాధితులు డిమాండ్ చేస్తున్నారు.