ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో జోరుగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో జోరుగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం
జి.కొండూరు, ఆగస్టు 2: ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జి.కొండూరు మండలం ఆత్కూరు గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఏడో రోజుకు చేరుకుంది. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ చేపట్టిన 45 రోజుల డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆదివారం గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో జి.కొండూరు మండల పార్టీ అధ్యక్షుడు వేములకొండ వెంకటేశ్వరరావు, ఆత్కూరు గ్రామ పార్టీ అధ్యక్షుడు ఈమని శ్రీనివాసరావు, మండల ఎస్సీసీఎల్ నాయకుడు బద్దెర వెంకటేశ్వరరావు, 145వ బూత్ కన్వీనర్ మంద ఇస్రాయేలు, మెండెం వెంకటరావు, మెండెం అరుణ్ కుమార్, మంద ఆంజనేయులు, మెండెం చినబాబు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.