BREAKING
ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ.. కుప్పంలో టీడీపీ SIR కార్యక్రమం నిర్వహణ శ్రీశైలం మల్లన్న స్వామికి వెండి నాగాభరణం సమర్పణ శ్రీశైలంలో వీరశైవ ఆగమ పాఠశాల ప్రవేశ పరీక్ష నిర్వహణ శ్రీశైలంలో కొనసాగుతున్న యోగా శిక్షణా కార్యక్రమాలు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ నాయకుడి వాలీమా వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి పట్టణంలో వాహనాల తనిఖీలు నిర్వహించిన అర్బన్ ఎస్ఐ హజరత్తయ్య నియోజకవర్గ ఆర్థికాభివృద్ధికి ఆటోనగర్ కేంద్రబిందువు కావాలి : ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పెరిగిన ధరలపై చిలకలూరిపేటలో ప్రజాసంఘాల ధర్నా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ.. కుప్పంలో టీడీపీ SIR కార్యక్రమం నిర్వహణ శ్రీశైలం మల్లన్న స్వామికి వెండి నాగాభరణం సమర్పణ శ్రీశైలంలో వీరశైవ ఆగమ పాఠశాల ప్రవేశ పరీక్ష నిర్వహణ శ్రీశైలంలో కొనసాగుతున్న యోగా శిక్షణా కార్యక్రమాలు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ నాయకుడి వాలీమా వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి పట్టణంలో వాహనాల తనిఖీలు నిర్వహించిన అర్బన్ ఎస్ఐ హజరత్తయ్య నియోజకవర్గ ఆర్థికాభివృద్ధికి ఆటోనగర్ కేంద్రబిందువు కావాలి : ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పెరిగిన ధరలపై చిలకలూరిపేటలో ప్రజాసంఘాల ధర్నా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక
www.ntodaynews.com

ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో మాతృహత్య ఘోరం – కుమారుడు తల్లి రమాదేవిని హత్య చేసినట్లు నిర్ధారణ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Jun, 2026 - 03:37 PM
46 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట:

తిరువూరు నియోజకవర్గం చింతకుంట ఎరియాలో, జూన్ 6న చోటుచేసుకున్న ఘోర ఘటనలో చింతకాయల రమాదేవి మెడ మరియు ఛాతీపై గాయాలతో మృతి చెందింది. ఈ ఘటనపై విస్సన్నపేట పోలీస్‌స్టేషన్‌లో CI గిరిబాబు మరియు SI అర్జున్ రాజ్ మీడియా సమావేశం నిర్వహించారు.

CI గిరిబాబు వివరాల ప్రకారం, దర్యాప్తు ప్రారంభించినప్పటి నుంచి మృతురాలి చిన్న కుమారుడు చింతకాయల రఘవంశీ ప్రవర్తనపై అనుమానం ఏర్పడింది. సాంకేతిక ఆధారాలు, సాక్షులు, వాంగ్మూలాలు మరియు విచారణలో వచ్చిన సమాచారంతో రఘవంశీనే తల్లి హత్యకు పాల్పడ్డాడని నిర్ధారణ అయ్యింది.

మృతురాలి కుమారుడు చింతకాయల రఘవంశీ, వయసు 25, మోటార్ మెకానిక్‌గా హైదరాబాదులో నివసిస్తున్నాడు. గతంలో ఖమ్మంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుటుంబానికి సుమారు 50,000 రూపాయల నష్టం పరిహారం చెల్లించడానికి రఘవంశీ అప్పులు తీసుకున్నాడు. అప్పులు తీర్చేందుకు తల్లి పేరు మీద ఉన్న ఇంటిని అమ్మాలని తరచూ ఒత్తిడి చేయడం, అలాగే రమాదేవికి హెచ్‌ఐవీ వ్యాధి ఉందని చుట్టుపక్కల వారికి చెబుతున్న పరిస్థితులు, కుమారుడికి మనోవేదన కలిగించడం వల్ల ఇద్దరి మధ్య తరచుగా గొడవలు జరిగాయి. ఈ పరిస్థితులలో, రఘవంశీ ముందుగానే తల్లిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.

జూన్ 6న హైదరాబాదులోని తన నివాసం నుంచి మోటార్ సైకిల్‌పై విస్సన్నపేటకు వచ్చి, జూన్ 7 తెల్లవారుజామున తల్లి రమాదేవితో వాగ్వాదం చేసిన అనంతరం అతను చేతుల ద్వారా తల్లిని బలంగా పీచి హత్య చేశాడు.

పోలీసులు హత్యకేసు పై స్పష్టమైన ఆధారాలు సేకరించి, రఘవంశీని జూన్ 7 ఉదయం 10 గంటలకు విస్సన్నపేట రెడ్డిగూడెం రోడ్‌లోని ఆర్సిఎం చర్చి సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించి స్వచ్ఛందంగా వాంగ్మూలం ఇచ్చాడు