BREAKING
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం
www.ntodaynews.com

ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో మాతృహత్య ఘోరం – కుమారుడు తల్లి రమాదేవిని హత్య చేసినట్లు నిర్ధారణ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Jun, 2026 - 03:37 PM
115 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట:

తిరువూరు నియోజకవర్గం చింతకుంట ఎరియాలో, జూన్ 6న చోటుచేసుకున్న ఘోర ఘటనలో చింతకాయల రమాదేవి మెడ మరియు ఛాతీపై గాయాలతో మృతి చెందింది. ఈ ఘటనపై విస్సన్నపేట పోలీస్‌స్టేషన్‌లో CI గిరిబాబు మరియు SI అర్జున్ రాజ్ మీడియా సమావేశం నిర్వహించారు.

CI గిరిబాబు వివరాల ప్రకారం, దర్యాప్తు ప్రారంభించినప్పటి నుంచి మృతురాలి చిన్న కుమారుడు చింతకాయల రఘవంశీ ప్రవర్తనపై అనుమానం ఏర్పడింది. సాంకేతిక ఆధారాలు, సాక్షులు, వాంగ్మూలాలు మరియు విచారణలో వచ్చిన సమాచారంతో రఘవంశీనే తల్లి హత్యకు పాల్పడ్డాడని నిర్ధారణ అయ్యింది.

మృతురాలి కుమారుడు చింతకాయల రఘవంశీ, వయసు 25, మోటార్ మెకానిక్‌గా హైదరాబాదులో నివసిస్తున్నాడు. గతంలో ఖమ్మంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుటుంబానికి సుమారు 50,000 రూపాయల నష్టం పరిహారం చెల్లించడానికి రఘవంశీ అప్పులు తీసుకున్నాడు. అప్పులు తీర్చేందుకు తల్లి పేరు మీద ఉన్న ఇంటిని అమ్మాలని తరచూ ఒత్తిడి చేయడం, అలాగే రమాదేవికి హెచ్‌ఐవీ వ్యాధి ఉందని చుట్టుపక్కల వారికి చెబుతున్న పరిస్థితులు, కుమారుడికి మనోవేదన కలిగించడం వల్ల ఇద్దరి మధ్య తరచుగా గొడవలు జరిగాయి. ఈ పరిస్థితులలో, రఘవంశీ ముందుగానే తల్లిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.

జూన్ 6న హైదరాబాదులోని తన నివాసం నుంచి మోటార్ సైకిల్‌పై విస్సన్నపేటకు వచ్చి, జూన్ 7 తెల్లవారుజామున తల్లి రమాదేవితో వాగ్వాదం చేసిన అనంతరం అతను చేతుల ద్వారా తల్లిని బలంగా పీచి హత్య చేశాడు.

పోలీసులు హత్యకేసు పై స్పష్టమైన ఆధారాలు సేకరించి, రఘవంశీని జూన్ 7 ఉదయం 10 గంటలకు విస్సన్నపేట రెడ్డిగూడెం రోడ్‌లోని ఆర్సిఎం చర్చి సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించి స్వచ్ఛందంగా వాంగ్మూలం ఇచ్చాడు