www.ntodaynews.com
రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఎన్.టి.ఆర్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయం, విజయవాడ
విజయవాడ నగరంలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఎన్.టి.ఆర్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగం పర్యవేక్షణలో ముఖ్య జంక్షన్ల వద్ద నిర్వహించిన ఈ తనిఖీల్లో 85 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వారిని సంబంధిత న్యాయస్థానంలో హాజరుపరచగా కోర్టు తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పు ప్రకారం 12 మందికి రెండు రోజుల జైలు శిక్ష విధించగా 73 మందికి మొత్తం రూ.7,40,000 జరిమానా విధించారు. జిల్లాలో ప్రతి రోజు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు సూచించారు.