www.ntodaynews.com
ఎస్బీఐ సమ్మె వాయిదా.. యథావిధిగా బ్యాంకింగ్ సేవలు
జాతీయం
దేశవ్యాప్తంగా 25, 26 తేదీల్లో జరగాల్సిన ఎస్బీఐ ఉద్యోగుల సమ్మె వాయిదా పడింది. బ్యాంకు యాజమాన్యం మరియు ఉద్యోగ సంఘాల మధ్య జరిగిన చర్చలు సఫలమవడంతో సమ్మెను తాత్కాలికంగా నిలిపివేశారు.
దీంతో ఈ రెండు రోజుల్లో బ్యాంకింగ్ సేవలకు ఎటువంటి అంతరాయం ఉండదని స్పష్టమైంది. దేశవ్యాప్తంగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోశాఖలు యథావిధిగా పనిచేయనున్నాయి.
ఖాతాదారులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అన్ని సాధారణ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయని ఎస్బీఐ వెల్లడించింది.