BREAKING
పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు.
www.ntodaynews.com

ఎస్సై డి రామకృష్ణ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Jun, 2026 - 06:28 AM
13 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం స్థానిక చాట్రాయి గ్రామంలో ఎస్సై డి. రామకృష్ణ ఆధ్వర్యంలో రోడ్డు సేఫ్టీ, డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ ధారణ, ట్రాఫిక్ నిబంధనలు తదితర అంశాలపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమానికి యువత, వాహనదారులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎస్సై డి. రామకృష్ణ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా నిర్లక్ష్యం కారణంగానే జరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం, వేగ పరిమితిని పాటించకపోవడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం వంటి కారణాలు ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తున్నాయని వివరించారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదం జరిగినప్పుడు తల గాయాల తీవ్రత తగ్గుతుందని, ఇది ప్రతి ఒక్కరి జీవన భద్రతకు సంబంధించిన అంశమని ఆయన పేర్కొన్నారు. అలాగే మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరమని, తల్లిదండ్రులు కూడా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల జరిగే ప్రమాదాలపై కూడా అవగాహన కల్పిస్తూ, మద్యం సేవించి వాహనం నడపడం ప్రాణాంతకమని తెలిపారు.

ప్రమాదాల నివారణ కోసం గ్రామస్థులు, యువత కలిసి ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచుకోవాలని, పోలీస్ శాఖ ఎప్పుడూ ప్రజల భద్రతకే ప్రాధాన్యం ఇస్తుందని ఆయన చెప్పారు. కార్యక్రమంలో స్థానికులు కూడా ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు.