బాల్య మిత్రునికి కుటుంబానికి ఆర్థిక సహాయం
NTODAY NEWS : చిట్యాల
తమతో పాటు కలిసి చదువుకున్న బాల్యమిత్రుడు అకాల మరణం చెందడంతో అతని మిత్రులంతా కలిసి ఆదివారం మృతుని కుటుంబ సభ్యులకు 60,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. చిట్యాల పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2004 - 05 విద్యా సంవత్సరంలో తమతోపాటు 10వ తరగతి చదివిన మేడి యాదగిరి ఇటీవల ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదం లో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బాల్య మిత్రులందరు తన స్నేహితుని ఆర్థిక పరిస్థితిని గమనించి అందరూ కలిసి 60 వేల రూపాయలు జమ చేశారు. అట్టి డబ్బులు మొత్తం మృతునికి గల ఇద్దరు కూతుర్లు పేరుమీద ఒక్కొక్కరికి 30 వేల చొప్పున స్థానిక పోస్ట్ ఆఫీస్ లో ఫిక్సడ్ డిపాజిట్ చేసి అట్టి పత్రాలను కుటుంబ సభ్యులకు అందచేశారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube