BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

​గడ్పూర్ గ్రామ పంచాయతీలో ఎంపీఓ తనిఖీలు.. రికార్డులు, ఆరోగ్య, అంగన్‌వాడీ కేంద్రాల పరిశీలన

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
19 Jun, 2026 - 04:13 PM
39 వీక్షణలు

గడ్పూర్ గ్రామ పంచాయతీని శుక్రవారం (19-06-2026) మండల పంచాయతీ అధికారి (ఎంపీఓ) ఏ. సుమన్ సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన గ్రామ పంచాయతీ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం, అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలించారు.

​ముందుగా గ్రామ పంచాయతీ కార్యాలయానికి చేరుకున్న ఆయన, కార్యాలయ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రానికి వెళ్లి, అక్కడ ప్రజలకు అందుతున్న వైద్య సేవలను తనిఖీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి.. కేంద్రం నిర్వహణ, పిల్లల హాజరు శాతం మరియు పోషకాహార పంపిణీ కార్యక్రమాల తీరును పరిశీలించారు.

​ఫ్రైడే - డ్రై డే లో భాగంగా పారిశుధ్య పనులు..

ప్రతి శుక్రవారం నిర్వహించే 'ఫ్రైడే - డ్రై డే' (Friday Dry Day) కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ముమ్మరంగా పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. గ్రామ పరిసరాలు, డ్రైనేజీలు, మరియు ప్రజా ప్రదేశాలలో జరుగుతున్న శుభ్రత పనులను ఎంపీఓ స్వయంగా పర్యవేక్షించి, పారిశుధ్య మెరుగుదలకు సంబంధించి సిబ్బందికి పలు కీలక సూచనలు అందించారు.

​ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గురిగంటి స్వప్న, పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ రాజు, ఏఎన్ఎం (ANM), ఆశా (ASHA) కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు