గీత కార్మికుల గొంతుక బొమ్మగోని ధర్మబిక్షం గౌడ్
గీత కార్మికుల గొంతుక బొమ్మగోని ధర్మబిక్షం గౌడ్
చిట్యాల గౌడ సంఘం ఆధ్వర్యంలో నివాళులు
చిట్యాల: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, నల్లగొండ మాజీ ఎంపీ, కల్లుగీత కార్మిక సంఘం వ్యవస్థాపక కార్యదర్శి కామ్రేడ్ బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ 15వ వర్ధంతి గురువారం చిట్యాలలో ఘనంగా జరిగింది. చిట్యాల గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక కంఠమహేశ్వర స్వామి దేవాలయ కమ్యూనిటీ హాల్ ఆవరణలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు
ఈ సందర్భంగా గౌడ సంక్షేమ సంఘ నాయకులు మాట్లాడుతూ ధర్మభిక్షం గౌడ్ తన జీవితాంతం గీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాడారని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు మారగోని రమేష్ గౌడ్, కోశాధికారి రేకులగడ్డ నరసింహ, పుల్లెంల కోటయ్య, దేశాగోని బాలరాజు, ఉపాధ్యక్షులు పంతంగి వెంకన్న గౌడ్, కాసుల సత్యనారాయణ గౌడ్, మేకల సురేష్ గౌడ్, కార్యవర్గ సభ్యులు కొంపెల్లి శ్రీనివాస్, పంతంగి కరుణాకర్, కాసుల శంకరయ్య, బొడ్డు శంకర్, కళ్లెం నరేందర్ తదితరులు పాల్గొన్నారు.