BREAKING
ప్రైవేటు వ్యక్తుల చేతిలో బిఎల్వోల లాగిన్ భవానిపురం , క్రాంబ్వే రోడ్డు లోని కుండల బజార్ డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తా భర్తతో విభేదాల నేపథ్యంలో ఇంటి నుంచి వెళ్లిన మహిళ.. ఆచూకీ కోసం పోలీసులు వెతుకులాట ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ప్రైవేటు వ్యక్తుల చేతిలో బిఎల్వోల లాగిన్ భవానిపురం , క్రాంబ్వే రోడ్డు లోని కుండల బజార్ డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తా భర్తతో విభేదాల నేపథ్యంలో ఇంటి నుంచి వెళ్లిన మహిళ.. ఆచూకీ కోసం పోలీసులు వెతుకులాట ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు
www.ntodaynews.com

గ్రామాల్లో స్వచ్ఛతపై ప్రత్యేక పరిశీలన – లింగపాలెం మండలంలో స్వచ్ఛపాదం కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Jun, 2026 - 07:16 PM
22 వీక్షణలు

ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలంలోని అన్నపనేనివారిగూడెం గ్రామ పంచాయతీలో డిప్యూటీ ఎంపీడీవో స్వచ్ఛపాదం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో పరిశుభ్రత పరిస్థితులు, సానిటేషన్ పనులు, తాగునీటి సరఫరా వ్యవస్థలను ప్రత్యక్షంగా పరిశీలించారు.

తాగునీటి పన్నుల వసూలు, స్వచ్ఛత నిర్వహణ, పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్ (PGRS) ద్వారా వచ్చిన ఫిర్యాదులపై కూడా సమీక్ష చేపట్టారు. గ్రామాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనుల పురోగతిని అధికారులతో కలిసి పరిశీలించి అవసరమైన సూచనలు అందించారు.

గ్రామ పంచాయతీల పరిధిలో పరిశుభ్రతను మెరుగుపరచాలని, ప్రజలకు మెరుగైన తాగునీటి సేవలు అందేలా చర్యలు వేగవంతం చేయాలని డిప్యూటీ ఎంపీడీవో సూచించారు. స్వచ్ఛపాదం కార్యక్రమం ద్వారా గ్రామాల్లో అవగాహన పెంపొందించి, పరిశుభ్రతను ప్రజా ఉద్యమంగా మార్చాలని పేర్కొన్నారు.