గ్రామాల్లో స్వచ్ఛతపై ప్రత్యేక పరిశీలన – లింగపాలెం మండలంలో స్వచ్ఛపాదం కార్యక్రమం
ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలంలోని అన్నపనేనివారిగూడెం గ్రామ పంచాయతీలో డిప్యూటీ ఎంపీడీవో స్వచ్ఛపాదం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో పరిశుభ్రత పరిస్థితులు, సానిటేషన్ పనులు, తాగునీటి సరఫరా వ్యవస్థలను ప్రత్యక్షంగా పరిశీలించారు.
తాగునీటి పన్నుల వసూలు, స్వచ్ఛత నిర్వహణ, పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్ (PGRS) ద్వారా వచ్చిన ఫిర్యాదులపై కూడా సమీక్ష చేపట్టారు. గ్రామాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనుల పురోగతిని అధికారులతో కలిసి పరిశీలించి అవసరమైన సూచనలు అందించారు.
గ్రామ పంచాయతీల పరిధిలో పరిశుభ్రతను మెరుగుపరచాలని, ప్రజలకు మెరుగైన తాగునీటి సేవలు అందేలా చర్యలు వేగవంతం చేయాలని డిప్యూటీ ఎంపీడీవో సూచించారు. స్వచ్ఛపాదం కార్యక్రమం ద్వారా గ్రామాల్లో అవగాహన పెంపొందించి, పరిశుభ్రతను ప్రజా ఉద్యమంగా మార్చాలని పేర్కొన్నారు.