BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

​గుడిపేట మెడికల్ కాలేజీని సందర్శించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
21 Jun, 2026 - 04:24 PM
210 వీక్షణలు

అధ్యాపకులు, విద్యార్థుల ఘన స్వాగతం

విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్న వైనం

మంచిర్యాల నియోజకవర్గం, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుడిపేటలో నూతనంగా ప్రారంభమైన ప్రభుత్వ మెడికల్ కాలేజీని మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు సందర్శించారు. ఈ సందర్భంగా కాలేజీకి విచ్చేసిన ఎమ్మెల్యేకు కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు.

​అనంతరం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు మెడికల్ కాలేజీ విద్యార్థులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కళాశాలలో వసతులు, ఇతరత్రా ఎదురవుతున్న ఇబ్బందులపై విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా చదువుపై దృష్టి సారించాలని, మీకు ఎదురయ్యే ప్రతి సమస్యను పరిష్కరించడానికి 'నేనున్నానని' ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు భరోసా కల్పించారు.

​ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్లా సత్యనారాయణ, స్థానిక కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు