గుడిపేట మెడికల్ కాలేజీని సందర్శించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
అధ్యాపకులు, విద్యార్థుల ఘన స్వాగతం
విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్న వైనం
మంచిర్యాల నియోజకవర్గం, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుడిపేటలో నూతనంగా ప్రారంభమైన ప్రభుత్వ మెడికల్ కాలేజీని మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు సందర్శించారు. ఈ సందర్భంగా కాలేజీకి విచ్చేసిన ఎమ్మెల్యేకు కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు మెడికల్ కాలేజీ విద్యార్థులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కళాశాలలో వసతులు, ఇతరత్రా ఎదురవుతున్న ఇబ్బందులపై విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా చదువుపై దృష్టి సారించాలని, మీకు ఎదురయ్యే ప్రతి సమస్యను పరిష్కరించడానికి 'నేనున్నానని' ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్లా సత్యనారాయణ, స్థానిక కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు