ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
నాలుగు పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టులు
* ఈ నెల 26 వరకు దరఖాస్తులకు గడువు: చిట్యాల ఎంఈఓ సైదా నాయక్
నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలోని నాలుగు ప్రభుత్వ పాఠశాలల్లో నూతనంగా ప్రారంభించనున్న ప్రీ-ప్రైమరీ తరగతులకు గాను ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాధికారి (MEO) పానుగోతు సైదా నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన (10 నెలల కాలానికి) ఈ నియామకాలు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
* పోస్టుల ఖాళీలు ఉన్న పాఠశాలలు:
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల - నేరడ
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల - వట్టిమర్తి
ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల - శివనేనిగూడెం
ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల - పేరేపల్లి
అర్హతలు, వయోపరిమితి వివరాలు:
ప్రీ-ప్రైమరీ ఇన్స్ట్రక్టర్: ఇంటర్మీడియట్ (10+2) లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. బాల్య విద్య (Early Childhood Education) లేదా ప్రాథమిక బోధనలో శిక్షణ పొందిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. గౌరవ వేతనం నెలకు రూ. 8,000 చొప్పున చెల్లిస్తారు.
* ఆయా పోస్టు
ఆయా పోస్ట్ కు కనీసం 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. గౌరవ వేతనం నెలకు రూ. 6,000 చొప్పున చెల్లిస్తారు.
వయస్సు: నోటిఫికేషన్ తేదీ నాటికి 18 నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST, BC, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు, మాజీ సైనికులకు 3 సంవత్సరాలు, మరియు దివ్యాంగులకు (PHC) 10 సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫారంతో పాటు అభ్యర్థులు తమ విద్యార్హతలకు సంబంధించిన అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్ల నకళ్లను జిరాక్స్ కాపీ లను తప్పనిసరిగా జత చేయాల్సి ఉంటుంది.
ఎంపిక ప్రక్రియలో స్థానిక అభ్యర్థులకే మొదటి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు
* దరఖాస్తు చేయు విధానం
అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 22 (22-06-2026) నుండి 26 (26-06-2026) సాయంత్రం 4:00 గంటల లోపు చిట్యాల మండల విద్యాధికారి కార్యాలయం (MEO Office) నందు స్వయంగా అందజేయాలని కోరారు. నిర్ణీత గడువు దాటిన తర్వాత వచ్చే దరఖాస్తులను పరిశీలించబోమని, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంఈఓ సైదా నాయక్ విజ్ఞప్తి చేశారు.