www.ntodaynews.com
పోతనపల్లి ప్రాథమిక పాఠశాలలో “సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్”ల పంపిణీ
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోతనపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు “సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్”లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం చాట్రాయి మండలం పరిధిలో జరిగింది.
ఈ సందర్భంగా వడిత్య రవీంద్ర, గ్రామ పెద్దలు లావూరి వెంకటేశ్వరరావు, ధారావతు మల్లికార్జునరావు, ధారావతు భాస్కరరావు, ధారావతు మంగయ్య, కొసరాజు అబ్బులు, ధారావత్ మొరార్జీ, ఏసుబాబు, సుధాకర్ అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
వక్తలు మాట్లాడుతూ విద్యార్థుల విద్యాభివృద్ధికి ఇలాంటి కిట్లు ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. కార్యక్రమం సాఫీగా నిర్వహించబడింది.