www.ntodaynews.com
గుడ్ల లారీ అడ్డంకి–నార్కెట్పల్లి హైవేపై బోల్తా పడిన సంఘటన
ఆంధ్రప్రదేశ్
పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం సంతగుడిపాడు కిట్టమ్మకుంట వద్ద హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా సింగరాయకొండకు వెళ్తున్న కోడిగుడ్ల లారీ అదుపుతప్పి బోల్తా పడింది.
సుమారు రూ.43 లక్షల విలువైన 53 వేల కోడిగుడ్ల ట్రేలు ఈ లారీలో ఉన్నాయని సమాచారం. ప్రమాదంలో దాదాపు 27 వేల ట్రేలు ధ్వంసమయ్యాయి. లారీ బోల్తా పడటంతో కోడిగుడ్ల ట్రేలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. మిగిలిన ట్రేలను స్థానికులు వెంటనే సేకరించారు.
పోలీసుల ప్రకారం, డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమై ఉండవచ్చు. ప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటన కారణంగా హైవేపై కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.