గుండ్రాంపల్లి వద్ద బోల్తా పడ్డ బొలెరో
గుండ్రాంపల్లి వద్ద బోల్తా పడ్డ బొలెరో NTODAY NEWS చిట్యాల
హైవేపై నిలిచిన రాకపోకలు
నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి సమీపంలో జాతీయ రహదారిపై గురువారం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ప్లాస్టిక్ బస్తాల లోడుతో వెళ్తున్న ఒక బొలెరో వాహనం అకస్మాత్తుగా టైరు పేలిపోవడంతో అదుపుతప్పి రోడ్డుపైనే బోల్తా పడింది. హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళ్తున్న ఈ వాహనం ఒక్కసారిగా బోల్తా పడటంతో, అందులోని ప్లాస్టిక్ బస్తాలన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. దీని ప్రభావంతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రెండు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సహాయంతో బోల్తా పడ్డ వాహనాన్ని, రోడ్డుపై పడిపోయిన బస్తాలను పక్కకు తొలగించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణహాని జరగలేదని ప్రాథమిక సమాచారం అందుతోంది.