BREAKING
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం
www.ntodaynews.com

గుంటూరు ఆసుపత్రి నుంచి పరారైన మోస్ట్ వాంటెడ్ నిందితుడు భీముడు అరెస్ట్

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Jun, 2026 - 04:39 PM
87 వీక్షణలు

గుంటూరు ప్రభుత్వాసుపత్రి నుంచి పోలీసులను మోసం చేసి పరారైన మోస్ట్ వాంటెడ్ నిందితుడు భీముడు అలియాస్ అజిత్ కుమార్‌ను పోలీసులు తమిళనాడులో అరెస్ట్ చేశారు. గత నెల 28న ఆసుపత్రి నుంచి తప్పించుకుని పారిపోయిన అతడి కోసం ఆంధ్రప్రదేశ్‌తో పాటు నాలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక బృందాలు విస్తృతంగా గాలింపు చేపట్టాయి.

ఓఎల్ఎక్స్ వేదికగా భారీ మోసాలకు పాల్పడి అనేక మందిని మభ్యపెట్టిన కేసుల్లో భీముడు నిందితుడిగా ఉన్నాడు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అమాయక ప్రజలను మోసం చేయడంలో అతడు నైపుణ్యం సంపాదించుకున్నట్లు పోలీసులు తెలిపారు.

తమిళనాడులో అతడి ఆచూకీ గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకుని గుంటూరుకు తరలిస్తున్నారు. భీముడు అరెస్టుతో అతడు పాల్పడిన మరిన్ని మోసాల వివరాలు, ఇతర సహచరుల పాత్ర కూడా వెలుగులోకి వచ్చే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు