www.ntodaynews.com
గుంటూరు కలెక్టరేట్లో యువతి ఆత్మహత్యాయత్నం
ఆంధ్రప్రదేశ్
/
గుంటూరు
గుంటూరు: వ్యక్తిగత సమస్యలతో అతి ఆవేశంలో ఉన్న యువతి ‘నాని’ అనే యువతి సోమవారం కలెక్టరేట్లో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.
సమాచారం మేరకు, యువతి తన తండ్రి, బాబాయ్ సహా ఇతర కుటుంబ సభ్యులు తన తల్లిని మరియు తనను వేధిస్తున్నారని ఆరోపించింది. తన తండ్రికి రెండో వివాహం చేసుకున్న తర్వాత, తల్లి దగ్గర ఉన్న 15 సవర్ల బంగారం, రూ.5 లక్షల నగదును తీసుకుని ఇంటి నుంచి బయటికి నెట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారం జరగకపోవడంతో, తీవ్ర ఆవేశంలో యువతి కలెక్టరేట్లో పురుగుల మందు తాగినట్లు తెలిపారు.
నగరంపాలెం పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని యువతిని వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్య సహాయం అందించారు.