www.ntodaynews.com
గుంటూరు యువ క్రికెటర్కు భారత్–ఏ జట్టులో అవకాశం..!
ఆంధ్రప్రదేశ్
/
గుంటూరు
గుంటూరు జిల్లాకు చెందిన యువ క్రికెటర్ షేక్ రషీద్ భారత్-ఏ జట్టులో చోటు సంపాదించాడు. ఈ నెల 24 నుండి శ్రీలంకలో జరగనున్న మల్టీ డే టోర్నీలో అతడు భారత్-ఏ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. గతంలో 2019 అండర్-19 ప్రపంచకప్లో వైస్ కెప్టెన్గా వ్యవహరించి భారత జట్టు విజయానికి కీలక పాత్ర పోషించిన రషీద్, రంజీ ట్రోఫీలోనూ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. భవిష్యత్తులో సీనియర్ జట్టులో స్థానం సంపాదిస్తాడని క్రీడా వర్గాలు ఆశిస్తున్నాయి.