BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

గుట్కా, పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు.. 28 మంది అరెస్ట్

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Jul, 2026 - 06:41 AM
52 వీక్షణలు

అన్నమయ్య జిల్లా: జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు పోలీసులు అసాంఘిక కార్యకలాపాలపై విస్తృతంగా దాడులు నిర్వహించారు. మదనపల్లిలోని ఓ గోదాంపై నాలుగు ప్రత్యేక బృందాలు ఏకకాలంలో దాడి చేసి, 'కూల్ లిప్'తో పాటు భారీ మొత్తంలో నిషేధిత గుట్కా ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు.

అదే సమయంలో సంబేపల్లి, పీలేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని నాలుగు పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించి 28 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.80,690 నగదును స్వాధీనం చేసుకున్నారు.

మత్తు పదార్థాల విక్రయం, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి హెచ్చరించారు. పోలీసులు ఇటువంటి దాడులు నిరంతరం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.