www.ntodaynews.com
గుట్కా, పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు.. 28 మంది అరెస్ట్
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
అన్నమయ్య జిల్లా: జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు పోలీసులు అసాంఘిక కార్యకలాపాలపై విస్తృతంగా దాడులు నిర్వహించారు. మదనపల్లిలోని ఓ గోదాంపై నాలుగు ప్రత్యేక బృందాలు ఏకకాలంలో దాడి చేసి, 'కూల్ లిప్'తో పాటు భారీ మొత్తంలో నిషేధిత గుట్కా ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు.
అదే సమయంలో సంబేపల్లి, పీలేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని నాలుగు పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించి 28 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.80,690 నగదును స్వాధీనం చేసుకున్నారు.
మత్తు పదార్థాల విక్రయం, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి హెచ్చరించారు. పోలీసులు ఇటువంటి దాడులు నిరంతరం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.