ఘనంగా 46వ డివిజన్ 'ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక' ముగింపు సభ
మంచిర్యాల: రాష్ట్ర ప్రభుత్వం, ఎమ్మేల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మరియు మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 46వ డివిజన్లో "ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక" వార్డు ముగింపు సభ ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి 46వ డివిజన్ కార్పొరేటర్ పెంట రజిత రమేష్ గారు, కో-ఆప్షన్ సభ్యులు కొండా పద్మ చంద్రశేఖర్ గారు, మంచిర్యాల ఎస్సై మధుసూదన్ గారు, వార్డు ఆఫీసర్ ప్రియాంక గారు మరియు మున్సిపల్ అధికారి మధు గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా డివిజన్లో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్యల గురించి చర్చించడంతో పాటు, భవిష్యత్ కార్యాచరణపై స్థానిక ప్రజల, మహిళల నుండి సూచనలు, అభిప్రాయాలను సేకరించారు. ప్రభుత్వ ఆశయాల ప్రకారం డివిజన్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని నాయకులు స్పష్టం చేసిన ఈ ముగింపు సభలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు