BREAKING
ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం
www.ntodaynews.com

​ఘనంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జన్మదిన వేడుకలు

తెలంగాణ
/ పెద్దపల్లి
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
01 Apr, 2026 - 07:13 PM
38 వీక్షణలు

గిరిజన విద్యార్థుల మధ్య మంత్రి జన్మదిన వేడుకలు 

ధర్మారం మినీ గురుకులంలో కేక్ కట్ చేసిన మంత్రి అడ్లూరి..

పాఠశాలను పదవ తరగతి ఆఫ్ గ్రేడ్ చేస్తానని హామీ..

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, దివ్వాంగులు మరియు వయో వృద్ధులు, ట్రాన్స్ జెండర్స్ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ తన జన్మదిన వేడుకలను పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని మినీ గురుకుల పాఠశాలలో గిరిజన విద్యార్థుల మధ్య జరుపుకున్నారు. ఈ సందర్భంగా మినీ గురుకుల పాఠశాలలో అదనపు తరగతి గదులు నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు నూతన కిచెన్ షెడ్ ను ప్రారంభించారు.


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం విద్యకు ప్రధాన ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా ధర్మపురికి రూ. 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలు మంజూరి చేసిందని మంత్రి అడ్లూరి తెలిపారు.


ధర్మారం మండలంలోని గురుకుల పాఠశాలలో వచ్చే విద్యా సంవత్సరం నుండి పదవ తరగతి వరకు తరగతులు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. 


రాజకీయంగా తొలిసారి అవకాశం కల్పించిన ధర్మారం మండలం పై తనకు ప్రత్యేక గౌరవం ఉంటుందని మంత్రి తెలిపారు. గెలిచినా ఓడిన ధర్మారం మండల ప్రజలు తన వెన్నంటి ఉన్నారని మంత్రి అడ్లూరి అన్నారు. ధర్మారం మండలానికి ఇప్పటికే ఐటిఐ కళాశాల మంజూరు చేశామని, రానున్న రోజుల్లో డిగ్రీ కళాశాల మంజూరుకి చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.


ఈ సందర్భంగా గురుకుల పాఠశాల విద్యార్థులకు సైకిళ్ళతో పాటు పరీక్షలకు హాజర ైన విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లను మంత్రి అందజేశారు.