BREAKING
ఘనంగా నిర్వహించిన ఆదివాసీల భారీ ర్యాలీ..... గంగా దేవి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి బోనాల జాతరలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్న మాజీ డీసీసీ అధ్యక్షురాలు తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం మెగా డీఎస్సీపై వీధి పోరాటాలు విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై రిలే నిరాహార దీక్ష శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం ఐక్యరాజ్యసమితి గుర్తించిన గిరిజనుల హక్కులను పాలకులు ఎందుకు పరిష్కరించడం లేదు? బండిఆత్మకూరు మండలం పార్నపల్లె లో PGRS నిర్వహించిన కలెక్టర్ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మహిళలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి: ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా ఆడికృత్తిక మహోత్సవం ఘనంగా నిర్వహించిన ఆదివాసీల భారీ ర్యాలీ..... గంగా దేవి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి బోనాల జాతరలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్న మాజీ డీసీసీ అధ్యక్షురాలు తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం మెగా డీఎస్సీపై వీధి పోరాటాలు విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై రిలే నిరాహార దీక్ష శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం ఐక్యరాజ్యసమితి గుర్తించిన గిరిజనుల హక్కులను పాలకులు ఎందుకు పరిష్కరించడం లేదు? బండిఆత్మకూరు మండలం పార్నపల్లె లో PGRS నిర్వహించిన కలెక్టర్ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మహిళలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి: ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా ఆడికృత్తిక మహోత్సవం
www.ntodaynews.com

ఘనంగా నిర్వహించిన ఆదివాసీల భారీ ర్యాలీ.....

తెలంగాణ
Reporter
గంగుల రాజ్ కుమార్ లక్సెట్టిపేట్ మండల ప్రతినిధి
09 Aug, 2026 - 05:14 PM
101 వీక్షణలు

ఘనంగా నిర్వహించిన ఆదివాసీల భారీ ర్యాలీ.. జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, సురేఖ దంపతులు.

ఆదివాసీల ఆత్మగౌరవ ప్రతీక ప్రపంచ ఆదివాసీ దినోత్సవం: మంచిర్యాలలో ఘనంగా వేడుకలు

  • ఘనంగా నిర్వహించిన భారీ ర్యాలీ.. జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, సురేఖ దంపతులు.
  • ఆదివాసీల హక్కులు, సంస్కృతి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: ఎమ్మెల్యే పిలుపు.

మంచిర్యాల: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆదివాసీ సోదరులు, సోదరీమణులు నిర్వహించిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఐబీ చౌరస్తా నుండి పద్మనాయక ఫంక్షన్ హాల్ వరకు నిర్వహించిన భారీ బ్యాలీ / సాంస్కృతిక ర్యాలీని వారు జెండా ఊపి ప్రారంభించారు. ఆదివాసీల సంప్రదాయ నృత్యాలు, డప్పు వాయిద్యాల నడుమ సాగిన ఈ ర్యాలీలో నాయకులు ఉత్సాహంగా అడుగులేస్తూ స్థానిక ఆదివాసీలకు సంఘీభావం తెలిపారు.

ఆదివాసీల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటాం: ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ.. ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం, వారి అనూహ్య సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుంబిగించాలని పిలుపునిచ్చారు. ఆదివాసీ సమాజ సర్వతోముఖాభివృద్ధికి, వారి సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం మరియు తమ కుటుంబం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

  • "ఆదివాసీల సంస్కృతి మన రాష్ట్ర గర్వకారణం.. వారి హక్కుల పరిరక్షనే మనందరి బాధ్యత" అని ఆయన ఉద్ఘాటించారు.

ఈ వేదికగా మంచిర్యాల ప్రాంతంలోని ఆదివాసీ సోదరసోదరీమణులందరికీ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మరియు సురేఖమ్మ గారు హృదయపూర్వక ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

పాల్గొన్న ప్రముఖులు: ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, పలువురు కార్పొరేటర్లు, వివిధ మండలాల ఆదివాసీ సంఘాల నాయకులు, పెద్ద సంఖ్యలో గిరిజన యువకులు, మహిళలు పాల్గొన్నారు.