BREAKING
లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా
Date of Publish : 02 June 2026, 03:16 pm
Posted by : కూనురు మధు

ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
02 Jun, 2026 - 03:16 PM
476 వీక్షణలు

ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం

నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ కాటం వెంకటేశం జాతీయ జెండాను ఆవిష్కరించారు.

​అనంతరం ఆయన మాట్లాడుతూ.. సకల జనుల సుదీర్ఘ పోరాటాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని కొనియాడారు. మరోవైపు పేద ప్రజల సంక్షేమం కోసం ఇందిరమ్మ గృహాలు, ఉచిత విద్యుత్, కొత్త రేషన్ కార్డుల మంజూరు వంటి పథకాలను అమలు చేస్తోందని గుర్తుచేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం ఉచిత దుస్తులు, పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనంలో సన్నబియ్యం అందిస్తూ.. విటమిన్లు, ప్రోటీన్లతో కూడిన స్నాక్స్, రాగిజావ, పాలు ఇస్తూ ఎంతో ప్రోత్సహిస్తోందని తెలిపారు. ప్రభుత్వ ప్రత్యేక శ్రద్ధ వల్లే ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఉత్తీర్ణత శాతం నమోదైందని సర్పంచ్ హర్షం వ్యక్తం చేశారు.

​ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వరుస సైదులు, పంచాయతీ సెక్రెటరీ ఆర్. కృష్ణయ్య, వార్డు సభ్యులు కురు యాదయ్య, తెల్సూరి నరసింహ, జల ప్రశాంత్, నీలకంఠం, లింగస్వామి, సాగర్ల నాగరాజు, ఏర్పుల వెంకన్న, గణేష్, చేకూరి తదితరులు పాల్గొన్నారు.