BREAKING
ద్రావిడ విశ్వవిద్యాయంలో డిప్లమా ఇన్ యోగా కోర్స్ పరీక్ష ప్రారంభం ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం చిట్యాల మార్కెట్ కమిటీలో ఘనంగా స్వాగత – వీడ్కోలు కార్యక్రమం పుంగనూరు MRO కార్యాలయం వద్ద నిరసన బీబీనగర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సంబరాలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన భువనగిరి మాజీ మార్కెట్ డైరెక్టర్ భువనగిరి సదానందం గౌడ్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ. తహసీల్దార్ కార్యాలయంలో సిమెంట్ బస్తాలు చోరీ చాట్రాయిలో మహిళల భద్రతపై అవగాహన సదస్సు బట్టలు ఆరేస్తూ విద్యుత్ షాక్‌తో వివాహిత మృతి ద్రావిడ విశ్వవిద్యాయంలో డిప్లమా ఇన్ యోగా కోర్స్ పరీక్ష ప్రారంభం ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం చిట్యాల మార్కెట్ కమిటీలో ఘనంగా స్వాగత – వీడ్కోలు కార్యక్రమం పుంగనూరు MRO కార్యాలయం వద్ద నిరసన బీబీనగర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సంబరాలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన భువనగిరి మాజీ మార్కెట్ డైరెక్టర్ భువనగిరి సదానందం గౌడ్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ. తహసీల్దార్ కార్యాలయంలో సిమెంట్ బస్తాలు చోరీ చాట్రాయిలో మహిళల భద్రతపై అవగాహన సదస్సు బట్టలు ఆరేస్తూ విద్యుత్ షాక్‌తో వివాహిత మృతి
www.ntodaynews.com

ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
02 Jun, 2026 - 03:16 PM
13 వీక్షణలు

ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం

నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ కాటం వెంకటేశం జాతీయ జెండాను ఆవిష్కరించారు.

​అనంతరం ఆయన మాట్లాడుతూ.. సకల జనుల సుదీర్ఘ పోరాటాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని కొనియాడారు. మరోవైపు పేద ప్రజల సంక్షేమం కోసం ఇందిరమ్మ గృహాలు, ఉచిత విద్యుత్, కొత్త రేషన్ కార్డుల మంజూరు వంటి పథకాలను అమలు చేస్తోందని గుర్తుచేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం ఉచిత దుస్తులు, పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనంలో సన్నబియ్యం అందిస్తూ.. విటమిన్లు, ప్రోటీన్లతో కూడిన స్నాక్స్, రాగిజావ, పాలు ఇస్తూ ఎంతో ప్రోత్సహిస్తోందని తెలిపారు. ప్రభుత్వ ప్రత్యేక శ్రద్ధ వల్లే ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఉత్తీర్ణత శాతం నమోదైందని సర్పంచ్ హర్షం వ్యక్తం చేశారు.

​ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వరుస సైదులు, పంచాయతీ సెక్రెటరీ ఆర్. కృష్ణయ్య, వార్డు సభ్యులు కురు యాదయ్య, తెల్సూరి నరసింహ, జల ప్రశాంత్, నీలకంఠం, లింగస్వామి, సాగర్ల నాగరాజు, ఏర్పుల వెంకన్న, గణేష్, చేకూరి తదితరులు పాల్గొన్నారు.