www.ntodaynews.com
స్థానిక సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం
తెలంగాణ
స్థానిక సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం-- దాసరి పాండు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు
NTODAY NEWS: బొమ్మలరామారం
రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో నెలకొన్న స్థానిక సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా ఉన్నదని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి పాండు అన్నారు శనివారం రోజున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని గ్రామపంచాయతీ కార్యదర్శి వినతి పత్రం ఇచ్చారు ఈ సందర్భంగా దాసరి పాండు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా స్థానికంగా ఉన్న సమస్యలు మంచినీటి సమస్య, డ్రైనేజీ, సిసి రోడ్లు, వీధిలైట్లు, గ్రామంలో ఉన్న లింక్ రోడ్లు సమస్యలతోపాటు ఇండ్లు,ఇండ్ల స్థలాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అని అన్నారు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన పేదలందరికీ ఇవ్వడం లేదని అని అన్నారు కొంతమందికే ఇచ్చి అందరికీ ఇస్తున్నామని చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు అర్హులైన పేద కుటుంబాలు వందలాదిగా ఇండ్లు,ఇండ్ల స్థలం లేక అవస్థలు పడుతున్నారని అని అన్నారు గతంలో మండల కేంద్రంలో కొంతమంది పేదలకు ఇచ్చిన స్థలాలను మధ్య దళారులు అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారని, వెంటనే అడ్డుకోవాలని వారన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ర్యాకల శ్రీశైలం నాయకులు దేశెట్టి సత్యనారాయణ, ముక్కర్ల పున్నమ్మ, మేకల మంగ, రమేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube