www.ntodaynews.com
టైమ్ టాప్-100లో స్మృతి మంధాన సత్తా
జాతీయం
భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధాన మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ప్రతిష్ఠాత్మక టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది క్రీడాకారుల జాబితాలో ఆమె చోటు దక్కించుకున్నారు.
ఈ జాబితాలో స్థానం పొందిన ఏకైక భారత క్రీడాకారిణిగా స్మృతి మంధాన నిలవడం విశేషం. అథ్లెట్లు, కోచ్లు, ఇన్వెస్టర్లు వంటి ప్రముఖులతో కూడిన ఈ ప్రతిష్ఠాత్మక జాబితాలో ఆమె ఎంపిక కావడం భారత క్రీడా ప్రపంచానికి గర్వకారణంగా మారింది.
ఈ జాబితాలో ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ, బాస్కెట్బాల్ స్టార్ లెబ్రాన్ జేమ్స్ వంటి ప్రముఖ క్రీడాకారులు కూడా చోటు సంపాదించారు.