BREAKING
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
Date of Publish : 04 April 2025, 01:05 am
Posted by : NTODAY NEWS OFFICIAL

నష్టపోయిన పంట పొలాలు, మామిడి తోటలను సందర్శించిన ప్రభుత్వ విప్

తెలంగాణ
04 Apr, 2025 - 01:05 AM
233 వీక్షణలు
నష్టపోయిన పంట పొలాలు, మామిడి తోటలను సందర్శించిన ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య NTODAY NEWS: తుర్కపల్లి, ఏప్రిల్ 04 అకాల వర్షానికి తుర్కపల్లి మండలంలో అతలకుతులం అయిన వ్యవసాయ పంటలను, మామిడి తోటలను శుక్రవారం రోజున ఉదయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సందర్శించారు.ఈ అకాల వర్షం వల్ల వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయి,వడ్లు, మామిడితోటలో మామిడి కాయలు నెలరాలయి, దీంతో ఆ రైతులను ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఓదార్చారు. వారి పంట పొలాలను మామిడి తోటలో కలయ తిరుగుతూ సందర్శించి ప్రభుత్వంవైపున ,తాను అండగా ఉంటామని ధీమా అందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య కలెక్టర్ హనుమంతరావుకి చరవాణి ద్వారా రైతుల ఆవేదనను తెలిపారు.నష్టపోయిన వివరాలు సేకరించి,నష్టపరిహారం అందిచాలని తెలిపారు.ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మాట్లాడుతూ గురువారం కురిసిన వర్షాలకు తుర్కపల్లి మండలంలో భారీగా నష్టము వాటిల్లిందని తెలిపారు.దయ్యంబండ, తుర్కపల్లి, మంచి రోని మామిళ్లు గ్రామాల్లో పంట పొలాలు, మామిడి తోటల్లో తీవ్ర నష్టం జరగటం బాధాకరమన్నారు. కలెక్టర్ కి సంబంధించిన అధికారులు నష్ట పోయిన పంటను అంచనా వేసి అధికారులు ప్రభుత్వానికి రిపోర్టు అందిచాలని తెలిపారు.ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి నష్టపోయిన రైతులకు నష్టపరిహారాన్ని అందించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మదర్ డైరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్య మహేందర్ రెడ్డి, మండల అధ్యక్షులు ధనావత్ శంకర్ నాయక్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube