www.ntodaynews.com
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి
తెలంగాణ
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి -- బట్టుపల్లి అనురాధ, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు
NTODAY NEWS: తుర్కపల్లి మండలం
శుక్రవారం రోజున తుర్కపల్లి మండలంలోని ములకలపల్లి గ్రామంలో సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో పిఎసిఎస్ సెంటర్ ను పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ హాజరై మాట్లాడుతూ మండల వ్యాప్తంగా సొసైటీ ఐకెపి సెంటర్లను ప్రారంభించినప్పటికీ వరి ధాన్యాన్ని కొనుగోలు నత్త నడకన నడుస్తున్నాయని వెంటనే వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రైతులు కష్టపడి పండించిన పంటకు మిల్లర్లు అధికారులు కొమ్మక్కై ఏ గ్రేడ్ ఉన్న బి గ్రేడ్ అని రాయడం శోచనీయమని అన్నారు మండల వ్యాప్తంగా రైతులు కోట్ల రూపాయలు నష్టపోతారని అన్నారు ధాన్యాన్ని పిఎసిఎస్ మరియు ఐకెపి సెంటర్లకు తీసుకువచ్చి కొనుగోలు కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ధాన్యాన్ని నిలువ చేసేందుకు పెద్ద రైతులు సుమారు ఇప్పటికే 10 వేల వరకు ఖర్చు వచ్చిందని ఇప్పటికైనా ప్రభుత్వం కనికరించి వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చిన వరి ధాన్యాన్నికి పట్టాల వసతులు ప్రభుత్వమే కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి పోతరాజు జహంగీర్ మండల కమిటీ సభ్యులు తలారి మాతయ్య గుండెబోయిన వెంకటేశం సిల్వర్ పెంటయ్య జేరిపోతుల కర్ణాకర్ కోట నాగరాజు రైతులు గుండెబోయిన బాల మల్లయ్య భూక్య లాలు భూక్య లక్ష్మి భూక్య సాయి తదితరులు పాల్గొన్నారు
Follow us on
Website
Facebook
Instagram
YouTube