www.ntodaynews.com
వేరుశనగ, ఉలవపొట్టు గడ్డివాములు దగ్ధం
తెలంగాణ
వేరుశనగ, ఉలవపొట్టు గడ్డివాములు దగ్ధం
NTODAY NEWS: అమడగూరు మండల రిపోర్టర్: రామాంజనేయులు
అమడగూరు, మండల పరిధిలోని గాజులపల్లి సమీపంలో ఉన్న మాతృశ్రీ వృద్ధాశ్రమం వద్ద వేరుశనగ, ఉలవపొట్టు గడ్డివాములు దగ్ధమయ్యాయి.
రైతులు తెలిపిన వివరాల ప్రకారం, కొలిమిరాళ్లపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్కు చెందిన మూడు ఉలవపొట్టు గడ్డివాములు, అలాగే గాజులపల్లి గ్రామానికి చెందిన శ్రీరాములుకు చెందిన ఒక ట్రాక్టర్ వేరుశనగ గడ్డి వాములు కాలిపోయాయి.
గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించడంతో ఈ ఘటన జరిగినట్లు రైతులు వాపోయారు. పశువుల మేత కోసం నిల్వ చేసుకున్న గడ్డివాములు పూర్తిగా కాలిపోవడంతో పశువులకు మేత లేకుండా పోయిందని తెలిపారు. ఈ ఘటనలో సుమారు రూ. 50,000 వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు.
రోడ్డు పక్కన కొందరు నిర్లక్ష్యంగా నిప్పు పెట్టడం వల్ల పశువుల మేతతో పాటు వ్యవసాయ పొలాల సమీపంలో ఉన్న విలువైన సామాగ్రి కూడా కాలిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.
#PutaparthiConstituency
#FarmersLoss
#FireAccident
#AgricultureNews
#FodderLoss
#RuralIssues
#FarmerProblems
#CropDamage
Follow us on
Website
Facebook
Instagram
YouTube