హైదరాబాద్ లో హాస్పిటల్ ల్లో మంత్రిని పరమర్శించిన ఎమ్మెల్యే
హైదరాబాద్: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను పరామర్శించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
హైదరాబాద్ :
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గత రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతూ సికింద్రాబాద్లోని యశోద హాస్పిటల్లో చేరారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.
విషయం తెలుసుకున్న జగిత్యాల శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్ ఈరోజు యశోద హాస్పిటల్కు వెళ్లి మంత్రిని పరామర్శించారు. మంత్రి ఆరోగ్యం గురించి అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మంత్రికి అందిస్తున్న వైద్య సేవలపై డాక్టర్లతో చర్చించిన ఎమ్మెల్యే, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్ర జ్వరంతో యశోదలో అడ్మిట్ అయ్యారు.
మంత్రి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు సమాచారం.
ఆత్మీయంగా పలకరించి, ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్.
ఈ పరామర్శ సమయంలో పలువురు నాయకులు, కార్యకర్తలు కూడా మంత్రి ఆరోగ్యంపై ఆరా తీశారు.