BREAKING
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం
www.ntodaynews.com

హైదరాబాద్‌లో ప్రేమ, స్వగ్రామంలో దారుణ హత్య: మేనమామ, తల్లి, భర్త హస్తంలో 24 ఏళ్ల యువతి

ఆంధ్రప్రదేశ్
/ శ్రీకాకుళం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Jun, 2026 - 06:40 AM
268 వీక్షణలు

శ్రీకాకుళం, టెక్కలి: ఒక యువత దారుణ హత్య ఘటన ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది. 24 ఏళ్ల దుంపల హరిణి అనే వివాహితను ఆమె తల్లి, తాత, భర్త సహకారంతో హత్య చేసి దహనం చేశారు.

మృతురాలి భర్త దుంపల దంతేశ్వరరావు మరియు మేనమామతో వివాహం చేసుకున్న హరిణికి 4 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. 2020లో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుండగా పెద్దలు వివాహం చేశారు. తరువాత గ్రూప్స్ కోచింగ్ కోసం హైదరాబాద్‌కు వెళ్లి S.R. నగర్‌లో హాస్టల్‌లో ఉండగా, అక్కడ సుధా నాగేంద్ర అనే యువకుడు ఆమె జీవితంలో ప్రవేశించాడు.

భర్త దంతేశ్వరరావు, తల్లి పైల విజయకుమారి దంపతులు హరిణి ప్రేమకధని తెలిసిన వెంటనే ఆమెను వెనక్కు తగ్గించే ప్రయత్నాలు చేశారు. అయితే హరిణి వెనక్కి తగ్గకపోవడంతో, భర్తతో విడాకులు కావాలని, ప్రియుడు సుధా నాగేంద్రతో వివాహం చేసుకుంటానని బహిరంగంగా చెప్పింది. ఈ సందర్భంలో కుటుంబసభ్యులు వివిధ రకాలుగా హరిణిని నమ్మించడానికి ప్రయత్నించినప్పటికీ, ఆమె వినలేదు.

హరిణి పై కుటుంబ ఒత్తిడి పెరిగి, హైదరాబాద్‌లో బాలానగర్ పోలీస్ స్టేషన్లో ఆమె కుటుంబ సభ్యులపై ఫిర్యాదు కూడా చేసింది. తీరుగా, ఈ నెల 1న రాత్రి హరిణిని స్వగ్రామంలో గుట్టుగా హత్య చేసి, గుండెపోటుతో మరణించినట్లు చూపించి తెల్లవారుజామున దహనం చేశారు.

పోలీసులు అనుమానం వ్యక్తం చేసిన తర్వాత దర్యాప్తు చేసి, హత్య నిజమని తేల్చారు. మృతురాలి తల్లి, తాత, భర్తను హంతకులుగా గుర్తించి, బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.

హరిణి జీవితం, విద్య, ప్రేమ, కుటుంబ ఒత్తిడి మిళితమై జరిగిన ఈ దారుణ ఘటన సమాజానికి తీవ్ర సందేశం ఇస్తోంది.