www.ntodaynews.com
హిమాచల్ప్రదేశ్లో ఘోర బస్సు ప్రమాదం.. ఏడుగురు మృతి
జాతీయం
హిమాచల్ప్రదేశ్లో ఘోర బస్సు ప్రమాదం.. ఏడుగురు మృతి
చంబా జిల్లాలో లోయలో పడిపోయిన ప్రైవేట్ బస్సు
హిమాచల్ప్రదేశ్లో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. చంబా జిల్లాలోని బైరాగర్–తిస్సా రహదారిపై చలుంజ్ మోర్ సమీపంలో 18 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది.
ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు మృతి చెందగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
క్షతగాత్రులను రక్షించి చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.