BREAKING
ప్రైవేటు వ్యక్తుల చేతిలో బిఎల్వోల లాగిన్ భవానిపురం , క్రాంబ్వే రోడ్డు లోని కుండల బజార్ డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తా భర్తతో విభేదాల నేపథ్యంలో ఇంటి నుంచి వెళ్లిన మహిళ.. ఆచూకీ కోసం పోలీసులు వెతుకులాట ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ప్రైవేటు వ్యక్తుల చేతిలో బిఎల్వోల లాగిన్ భవానిపురం , క్రాంబ్వే రోడ్డు లోని కుండల బజార్ డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తా భర్తతో విభేదాల నేపథ్యంలో ఇంటి నుంచి వెళ్లిన మహిళ.. ఆచూకీ కోసం పోలీసులు వెతుకులాట ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు
www.ntodaynews.com

హోంమంత్రి వంగలపూడి అనితపై అనుచిత వ్యాఖ్యలు ఖండించిన వాసం మునియ్య

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Jun, 2026 - 10:18 AM
15 వీక్షణలు

రాష్ట్ర హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న  వంగలపూడి అనిత పట్ల మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ మాదిగ వెల్ఫేర్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ వాసం మునియ్య తీవ్రంగా ఖండించారు.

దళిత మహిళగా స్వశక్తితో ఎదిగి రాష్ట్రానికి సేవలందిస్తున్న అనిత పై వ్యక్తిగత దూషణలు, అవమానకర వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగత విమర్శలకు దిగడం బాధాకరమని వ్యాఖ్యానించారు.

మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని దళిత సమాజానికి, మహిళలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఎవరు మాట్లాడినా సహించబోమని స్పష్టం చేశారు.

రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సమస్యలపై చర్చించాల్సిన ప్రతిపక్ష నాయకులు వ్యక్తిగత విమర్శలు, అసభ్య వ్యాఖ్యలు మానుకుని బాధ్యతాయుతమైన రాజకీయాలు చేయాలని వాసం మునియ్య కోరారు.