www.ntodaynews.com
హోంమంత్రిపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం తగదు:
ఆంధ్రప్రదేశ్
/
అనకాపల్లి
హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తప్పుడు వ్యాఖ్యలు చేయడం తగదని పాయకరావుపేట నియోజకవర్గం టీడీపీ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేశ్ అన్నారు. మంగళవారం నక్కపల్లిలో మాట్లాడుతూ ఎక్కడా అవినీతి జరగకుండా పారదర్శకంగా డీఎస్సీ నిర్వహించి 16 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందన్నారు. డబ్బు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారని చేస్తున్న ఆరోపణలను ఖండించారు. పార్టీ నాయకులు లింగన్నాయుడు, గింజల లక్ష్మణరావు పాల్గొన్నారు.