BREAKING
చక్ర వడ్డీ బారు వడ్డీ లతో ఇబ్బందుల్లో భాధితులు...! మహిళల భద్రతే లక్ష్యం హుజురాబాద్ పై డంపింగ్ యార్డ్ మోపడం ఆపాలి. రహదారి భద్రతకు పోలీస్ కవచం కొండమడుగు గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో అన్నప్రాశన కార్యక్రమం. శ్రీనివాస్ సెంటర్ టు సంజీవనగర్ గేట్ రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన ... మంత్రి ఎన్ఎండి ఫరూక్ రహదారి ఆక్రమణలపై మంత్రి ఎన్ఎండి ఫరూక్ సీరియస్ ముఖ్య కార్యకర్తలతో, నాయకులతో సమావేశం నిర్వహించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్ ​సరిపడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి ధాన్యాల కొనుగోలు ప్రక్రియలో కీలక మార్పులు చేసిన ప్రభుత్వం చక్ర వడ్డీ బారు వడ్డీ లతో ఇబ్బందుల్లో భాధితులు...! మహిళల భద్రతే లక్ష్యం హుజురాబాద్ పై డంపింగ్ యార్డ్ మోపడం ఆపాలి. రహదారి భద్రతకు పోలీస్ కవచం కొండమడుగు గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో అన్నప్రాశన కార్యక్రమం. శ్రీనివాస్ సెంటర్ టు సంజీవనగర్ గేట్ రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన ... మంత్రి ఎన్ఎండి ఫరూక్ రహదారి ఆక్రమణలపై మంత్రి ఎన్ఎండి ఫరూక్ సీరియస్ ముఖ్య కార్యకర్తలతో, నాయకులతో సమావేశం నిర్వహించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్ ​సరిపడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి ధాన్యాల కొనుగోలు ప్రక్రియలో కీలక మార్పులు చేసిన ప్రభుత్వం
www.ntodaynews.com

హుజురాబాద్ పై డంపింగ్ యార్డ్ మోపడం ఆపాలి.

తెలంగాణ
/ కరీంనగర్ / కరీంనగర్ అర్బన్
Reporter
రాజేష్ తాళ్లపెల్లి హుజురాబాద్ నియోజకవర్గ ప్రతినిధి
26 Apr, 2026 - 10:55 AM
7 వీక్షణలు

హుజురాబాద్ పై డంపింగ్ యార్డ్ మోపడం ఆపాలి. లేని పక్షంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వరకు పోరాటం తప్పదు జక్కని సంజయ్ కుమార్

హుజురాబాద్‌పై డంపింగ్ యార్డు మోపడం ఆపాలి – లేనిపక్షంలో National Green Tribunal వరకు పోరాటం తప్పదు: జక్కని సంజయ్ కుమార్

హుజురాబాద్ ప్రాంతాన్ని చెత్త మైదానంగా మార్చే కుట్రను వెంటనే నిలిపివేయాలని బీసీ ఆజాది ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు జక్కని సంజయ్ కుమార్ గట్టిగా హెచ్చరించారు. ప్రజల ప్రాణాలతో ఆడుకునే ఈ డంపింగ్ యార్డు ప్రతిపాదనను తక్షణమే రద్దు చేయకపోతే తీవ్ర స్థాయిలో ప్రజా ఉద్యమం చేపట్టి, అవసరమైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వరకు వెళ్లడానికి వెనుకాడమని స్పష్టం చేశారు.

ఈ రోజు హుజురాబాద్ పట్టణంలోని బీసీ ఆజాది ఫెడరేషన్ కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ—

జనావాసాల మధ్యలో, పచ్చని పంట పొలాల మధ్యలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడం ప్రజల ఆరోగ్యాన్ని, భవిష్యత్తును నాశనం చేసే నిర్ణయమని మండిపడ్డారు. ప్రజలకు ఉపయోగకరంగా ఉండే విద్యుత్ ఉత్పత్తి పేరుతో ప్రజలపై విష రసాయనాలను మోపే ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించమని హెచ్చరించారు.

ఇలాంటి ప్లాంట్లను ప్రజలు నివసించని దూర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి గాని, హుజురాబాద్‌ను లక్ష్యంగా ఎంచుకోవడం వెనుక స్పష్టమైన రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. హుజురాబాద్ ప్రజలు ఓట్ల కోసం మాత్రమే గుర్తు చేసుకునే ప్రజలు కారని, వారి ప్రాణాలకు విలువ లేదని భావించడం దుర్మార్గమని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధనలో హుజురాబాద్ ప్రజలు చేసిన త్యాగాలను మరిచిపోవడం ప్రభుత్వం చేస్తున్న అతిపెద్ద అన్యాయం అని విమర్శించారు. వెంటనే ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకోకపోతే రోడ్లపై భారీ స్థాయిలో ఆందోళనలు చేపట్టి ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు.

హుజురాబాద్‌ను చెత్త కుప్పగా మార్చే కుట్ర ఆపాలని అన్నారు, 

హుజురాబాద్ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ డంపింగ్ యార్డు పేరుతో విషాన్ని మోపే ప్రభుత్వ ప్రయత్నాన్ని బీసీ ఆజాది ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు, 

ఇది అభివృద్ధి కాదు — ఇది నాశనంమన్నారు, ఇది ప్రాజెక్ట్ కాదు — ఇది ప్రజలపై విష దాడి అన్నారు, 

జనావాసాల మధ్యలో, పచ్చని పంట పొలాల మధ్యలో డంపింగ్ యార్డు పెట్టడం అంటే ప్రజల ఆరోగ్యాన్ని, భవిష్యత్తును తాకట్టు పెట్టడమే అన్నారు,. హుజురాబాద్ ప్రజలు ప్రయోగాల కోసం ఉన్నవారు కారే! విద్యుత్ ఉత్పత్తి పేరుతో విష వాయువులు, ప్రమాదకర రసాయనాలు విడుదల చేసే ప్లాంట్‌ను ఇక్కడ ఏర్పాటు చేయడం వెనుక స్పష్టమైన రాజకీయ దురుద్దేశం ఉంది.

హుజురాబాద్‌పై ఈ అన్యాయం ఎందుకు?

ఇక్కడి ప్రజల ప్రాణాలకు విలువ లేదా?

ఇది మేము సహించం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోం.

డంపింగ్ యార్డు ప్రతిపాదనను వెంటనే రద్దు చేయాలి. లేకపోతే—

భారీ స్థాయిలో ప్రజా ఉద్యమం చేస్తామని రోడ్లపై నిరసనలు ప్రభుత్వంపై పూర్తి స్థాయి పోరాటం మరియు అవసరమైతే జాతీయ  గ్రీన్ ట్రిబ్యునల్ వరకు వెళ్లి ఈ ప్రాజెక్ట్‌ను ఆపేస్తాం!

హుజురాబాద్ ప్రజలు మౌనంగా ఉండరు.

ప్రజల ఆరోగ్యం మీద రాజకీయం చేస్తే క్షమించం. ఇది హెచ్చరిక కాదు — ఇది పోరాటానికి నాంది యని అన్నారు.హుజురాబాద్‌ను చెత్త కుప్పగా మార్చే కుట్ర ఆపాలి! 



ఈ కార్యక్రమంలో బీసీ ఆజాది ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిలుకమారి శ్రీనివాస్, హుజురాబాద్ మండల అధ్యక్షుడు నడిగోటి రమేష్, ప్రధాన కార్యదర్శి మమునూరి ప్రవీణ్, ఉపాధ్యక్షుడు కొల్లిపాక క్రాంతి కుమార్, ప్రచార కార్యదర్శి పంజాల వెంకటేశ్వర్లు గౌడ్, కందుకూరి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.