BREAKING
త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు
www.ntodaynews.com

దుర్గాడ గ్రామంలో ఇంటి దొంగతనం

తెలంగాణ
07 Feb, 2026 - 09:34 AM
158 వీక్షణలు
దుర్గాడ గ్రామంలో ఇంటి దొంగతనం బంగారం, వెండి ఆభరణాలు చోరీ – పోలీసుల దర్యాప్తు ప్రారంభం NTODAY NEWS:  గొల్లప్రోలు మండల రిపోర్టర్: బోర శివారెడ్డి దుర్గాడ గ్రామంలో దొంగతన ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన వెలుగుల భాస్కరరావు, ఆయన అత్తమామలు కొండేపూడి సూర్యనారాయణ దంపతులు జనవరి 24న పూణేలో నివసిస్తున్న తమ కుమారుడి వద్దకు వెళ్లారు. ఇంటిని చూసుకోవాలని బంధువులకు చెప్పి వెళ్లినట్లు సమాచారం. ఫిబ్రవరి 7 ఉదయం సుమారు 7 గంటలకు ఫిర్యాదుదారు ఇంటికి వెళ్లి చూడగా, ప్రధాన ద్వారం కొద్దిగా తెరిచి ఉండటం గమనించారు. లోపలికి వెళ్లి పరిశీలించగా, రెండు బెడ్‌రూమ్‌లలోని ఐరన్ బీరువాలు తెరిచి ఉండి, సామాన్లు చిందరవందరగా పడి ఉండటం కనిపించింది. వెంటనే ఇంటి యజమానులకు సమాచారం అందించగా, బీరువాల్లో ఉన్న సుమారు 50 గ్రాముల బరువు గల ఆరు రకాల బంగారు ఆభరణాలు, దాదాపు రెండున్నర కిలోల వెండి వస్తువులు గుర్తుతెలియని దొంగలు చోరీ చేసినట్లు తెలిసింది. ఈ ఘటనపై గొల్లప్రోలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు అందగా, ఎస్సై ఎన్. రామకృష్ణ కేసు నమోదు చేసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం పిఠాపురం సీఐ శ్రీనివాస్‌తో పాటు క్లూస్ టీం ఇన్‌స్పెక్టర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. #TheftCase #HouseBreakIn #KakinadaDistrict #Gollaprolu #Durgaada #CrimeNews #AndhraPradesh Follow us on Website Facebook Instagram YouTube