BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

దుర్గాడ గ్రామంలో ఇంటి దొంగతనం

తెలంగాణ
07 Feb, 2026 - 09:34 AM
248 వీక్షణలు
దుర్గాడ గ్రామంలో ఇంటి దొంగతనం బంగారం, వెండి ఆభరణాలు చోరీ – పోలీసుల దర్యాప్తు ప్రారంభం NTODAY NEWS:  గొల్లప్రోలు మండల రిపోర్టర్: బోర శివారెడ్డి దుర్గాడ గ్రామంలో దొంగతన ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన వెలుగుల భాస్కరరావు, ఆయన అత్తమామలు కొండేపూడి సూర్యనారాయణ దంపతులు జనవరి 24న పూణేలో నివసిస్తున్న తమ కుమారుడి వద్దకు వెళ్లారు. ఇంటిని చూసుకోవాలని బంధువులకు చెప్పి వెళ్లినట్లు సమాచారం. ఫిబ్రవరి 7 ఉదయం సుమారు 7 గంటలకు ఫిర్యాదుదారు ఇంటికి వెళ్లి చూడగా, ప్రధాన ద్వారం కొద్దిగా తెరిచి ఉండటం గమనించారు. లోపలికి వెళ్లి పరిశీలించగా, రెండు బెడ్‌రూమ్‌లలోని ఐరన్ బీరువాలు తెరిచి ఉండి, సామాన్లు చిందరవందరగా పడి ఉండటం కనిపించింది. వెంటనే ఇంటి యజమానులకు సమాచారం అందించగా, బీరువాల్లో ఉన్న సుమారు 50 గ్రాముల బరువు గల ఆరు రకాల బంగారు ఆభరణాలు, దాదాపు రెండున్నర కిలోల వెండి వస్తువులు గుర్తుతెలియని దొంగలు చోరీ చేసినట్లు తెలిసింది. ఈ ఘటనపై గొల్లప్రోలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు అందగా, ఎస్సై ఎన్. రామకృష్ణ కేసు నమోదు చేసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం పిఠాపురం సీఐ శ్రీనివాస్‌తో పాటు క్లూస్ టీం ఇన్‌స్పెక్టర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. #TheftCase #HouseBreakIn #KakinadaDistrict #Gollaprolu #Durgaada #CrimeNews #AndhraPradesh Follow us on Website Facebook Instagram YouTube