www.ntodaynews.com
ఇబ్రహీంపట్నంలో దొంగ నోట్ల కలకలం.. రూ.4.50 లక్షల నకిలీ కరెన్సీ స్వాధీనం
ఆంధ్రప్రదేశ్
ఇబ్రహీంపట్నంలో దొంగ నోట్ల వ్యవహారం కలకలం రేపింది. సుమారు రూ.4 లక్షల 50 వేల విలువైన నకిలీ కరెన్సీని ఇబ్రహీంపట్నం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పలువురు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.
పోలీసుల విచారణలో గతంలో కూడా ఇదే ప్రాంతంలో నకిలీ నోట్లను చలామణి చేసినట్లు నిందితులు వెల్లడించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టి, నకిలీ కరెన్సీ ముఠాతో సంబంధాలపై ఆరా తీస్తున్నారు.