BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

ఇంకా కచ్చా రోడ్లేనా..? ఇరవై ఏళ్లు దాటినా వైఎస్సార్ కాలనీలో మారని దుస్థితి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jul, 2026 - 04:13 PM
14 వీక్షణలు

ఇంకా కచ్చా రోడ్లేనా..? ఇరవై ఏళ్లు దాటినా వైఎస్సార్ కాలనీలో మారని దుస్థితి

రోడ్లు లేవు.. డ్రైనేజీ లేదు.. తాగునీటికీ తీరని కష్టాలు

చింతలపూడి: పట్టణంలో కాలనీలు ఏర్పడి దశాబ్దాలు గడుస్తున్నా, పలు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు మాత్రం ఇప్పటికీ కలగానే మిగిలాయి. గుప్తా మిల్ వెనుక ఉన్న వైఎస్సార్ కాలనీ 2004లో ఏర్పడినా, ఇరవై ఏళ్లు దాటిన తర్వాత కూడా అక్కడి ప్రజలు కనీస వసతుల కోసం ఎదురు చూస్తున్నారు.

కాలనీలో ఇప్పటికీ కచ్చా రోడ్లే ఉండటంతో వర్షం పడితే అడుగు బయట పెట్టలేని పరిస్థితి నెలకొంది. డ్రైనేజీ వ్యవస్థ లేక మురుగునీరు నిల్వ ఉండడంతో దుర్వాసనతో పాటు దోమల బెడద పెరుగుతోందని స్థానికులు వాపోతున్నారు. తాగునీటి సదుపాయం కూడా లేక, వచ్చే నీరు మురికిగా ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రధాన రహదారుల అభివృద్ధికే పరిమితమవుతున్న అధికారులు, ప్రజాప్రతినిధులు కాలనీల్లోని సమస్యలను పూర్తిగా విస్మరించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రతి వర్షాకాలంలో ఇదే దుస్థితి పునరావృతమవుతున్నా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడం లేదని మండిపడుతున్నారు.

ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వైఎస్సార్ కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, స్వచ్ఛమైన తాగునీటి సదుపాయం వంటి కనీస మౌలిక వసతులను వెంటనే కల్పించాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.