www.ntodaynews.com
ఇంటి పనుల విషయంలో మందలించడంతో యువతి ఆత్మహత్య
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఇంటి పనుల విషయంలో మందలించడంతో యువతి ఆత్మహత్య
కామవరపుకోట: కామవరపుకోట మండలం ఆడమిల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అలేఖ్య (19) అనే యువతి ఇంటి పనులు సరిగా చేయడం లేదని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, గత నెల 23న అలేఖ్య ఎలుకల మందు సేవించింది. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందింది.
మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.