www.ntodaynews.com
ఇంటర్ విద్యార్థినులపై ఆదిభట్ల సీఐ దాడి ఆరోపణలు
తెలంగాణ
/
రంగారెడ్డి
రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్లోని న్యూ శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదంటూ విద్యార్థులు, విద్యార్థినులు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా పరిస్థితిని నియంత్రించేందుకు వచ్చిన ఆదిభట్ల సీఐ విద్యార్థులపై దౌర్జన్యంగా వ్యవహరించారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా విద్యార్థినులను తోసివేయడం, నిరసనను బలవంతంగా అణచివేయడానికి ప్రయత్నించారంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటనతో కాలేజీ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, విద్యార్థులు సీఐ చర్యలను ఖండిస్తూ నినాదాలు చేశారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.